శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో  విషాదం  నెలకొంది. పెళ్లైన మూడు రోజులకే నవదంపతులు మృతి చెందారు.  


శ్రీకాకుళం : పెళ్లైన మూడు రోజులకే నవదంపతులు సోమవారం నాడు మృతి చెందారు. ఈ ఘటన శ్రీకాళుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో విషాదాన్ని నింపింది .శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం గ్రామానికి చెందిన వేణుకు ఒడిశాలోని బ్రహ్మపురకు చెందిన సుభద్రతో ఈ నెల 10వ తేదీన విశాఖపట్టణంలోని సింహచలంలో జరిగింది. వివాహం తర్వాత నవదంపతులు ఇచ్చాపురంలో ఉన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

సంద్రదాయం ప్రకారంగా నవదంపతులు ఒడిశాలోని బ్రహ్మపురకు బైక్ పై సోమవారం నాడు బయలుదేరారు బైక్ పై వెళ్తున్న సమయంలో వేణు దంపతులు ప్రయాణీస్తున్న బైక్ ను ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో సుభద్ర అక్కడికక్కడే మరణించింది. బ్రహ్మపుర ఆసుపత్రికి వేణును తరలిస్తున్న సమయంలో అతను మృతి చెందారు. ఈ విషయం తెలిసిన రెండు కుటుంబాల కు చెందిన సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.