హైదరాబాద్ కి వీడుకోలు, హిందూపురంలో ఓటు నమోదు చేసుకున్న బాలకృష్ణ
సినీనటుడు బాలకృష్ణ గురువారం అనంతపురం జిల్లా హిందూపురంలో ఓటు నమోదు చేసుకున్నారు.
హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ గురువారం అనంతపురం జిల్లా హిందూపురంలో ఓటు నమోదు చేసుకున్నారు. త్వరలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ నేపథ్యంలో రాష్ట్రం మొత్తం ఓటరు నమోదు కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీనిలో.. బాలకృష్ణ ఓటు నమోదు చేసుకున్నారు.
గతంలో చంద్రబాబుకి... హైదరాబాద్ లో ఓటు ఉండేది. దీనిని సాకుగా చేసుకొని ప్రతిపక్షాలు చాలా సార్లు బాలకృష్ణ పై విమర్శలు చేశాయి. హిందూపురంలో ఓటు కూడా లేకుండా ఇక్కడ పోటీ చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఇలాంటి ఛాన్స్ మరోసారి ఇవ్వకూడదని భావించిన బాలయ్య.. తన సొంత నియోజకవర్గంలో ఓటు నమోదు చేసుకున్నట్లు సమాచారం.