Asianet News TeluguAsianet News Telugu

విషాదాంతం.. మున్నేరులో గల్లంతైన ఐదుగురు విద్యార్థులు మృతి.. మృతదేహాలు వెలికితీత..

బాల ఏసు, చరణ్‌, అజయ్‌తో పాటు మరో చిన్నారి మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెలికితీసింది. మరో చిన్నారి కోసం గాలింపు చర్యలు కొనసాగాయి. చివరికి ఐదో చిన్నారి మృతదేహం కూడా వెలికి తీశారు. చిన్నారుల మృతదేహాలను చూసి బోరున తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. చిన్నారుల మృతితో ఏటూరులో విషాదఛాయలు అలముకున్నాయి. 

missing kids dead bodys found in chandarlapadu munneruvagu at krishna district
Author
Hyderabad, First Published Jan 11, 2022, 10:51 AM IST

కృష్ణాజిల్లా : చందర్లపాడు మండలం ఏటూరు దగ్గర విషాదం చోటు చేసుకుంది. మున్నేరు వాగులో ఐదుగురు చిన్నారులు గల్లంతైన విషయం తెలిసిందే. వారిలో నలుగురు చిన్నారుల dead bodyలను వెలికి తీశారు. బాల ఏసు, చరణ్‌, అజయ్‌తో పాటు మరో చిన్నారి మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెలికితీసింది. మరో చిన్నారి కోసం గాలింపు చర్యలు కొనసాగాయి. చివరికి ఐదో చిన్నారి మృతదేహం కూడా వెలికి తీశారు. చిన్నారుల మృతదేహాలను చూసి బోరున తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. చిన్నారుల మృతితో ఏటూరులో విషాదఛాయలు అలముకున్నాయి. 

కృష్ణాజిల్లా, చందర్లపాడు మండలం ఏటూరు వద్ద మున్నేరు వాగులో గల్లంతైన ఐదుగురు చిన్నారుల కథ విషాదాంతం అయ్యింది. వాగులో మునిగి చనిపోయినట్టు తేలింది. వీరిలో ఐదుగురు మృత దేహాలను మంగళవారం వెలికి తీశారు. బాల యేసు (12), అజయ్ (12), గురజాల చరణ్ (14), మాగులూరు సన్నీ (12),  మైల రాకేష్ (11)ల మృతదేహాలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెలికి తీసింది. 

మరో చిన్నారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చిన్నారుల మృతదేహాలను చూసి భోరున తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. చిన్నారుల మృతితో ఏటూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. 

ఇదిలా ఉండగా, కృష్ణాజిల్లా  chandarlapadu మండలం ఏలూరు గ్రామం వద్ద munneru surroundingsల్లో ఐదుగురు పిల్లలు సోమవారం  missing అయ్యారు. గ్రామానికి చెందిన 8 నుంచి 13 ఏళ్ల మధ్య వయసు కలిగిన ఐదుగురి పిల్లలు మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి మున్నేరు వైపు వెళ్లారు. రాత్రి అవుతున్నా పిల్లలు ఇంటికి రాకపోవడంతో ఆందోళనతో ఉన్న తల్లిదండ్రులు వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.  

పిల్లల బట్టలు, వారి సైకిళ్ళు ఏటి ఒడ్డున ఉండటంతో ఆ పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామస్థులు సైతం పరిసర ప్రాంతాల్లో పిల్లల కోసం గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. రాత్రయినా ఆచూకీ తెలియకపోవడంతో  తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

తప్పిపోయిన పిల్లలు.. మాగులూరు సన్నీ (12),  మైల రాకేష్ (11), కర్ల బాల యేసు (12), అజయ్ (12), గురజాల చరణ్ (14)లు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 6, 7, 9 తరగతులు చదువుతున్నారు. సంక్రాంతి సెలవులు కావడంతో వీరంతా ఇంటి దగ్గరే ఉన్నారు. సోమవారం ఉదయం వీరు వంటకు పుల్లలు తీసుకొద్దామని సైకిళ్లపై బయలుదేరారు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆరాతీశారు. పిల్లలు మున్నేరు దగ్గరికి వెళ్లినట్లు పశువుల కాపరులు సమాచారం ఇచ్చారు.

దీంతో తల్లిదండ్రులు మున్నేరు దగ్గర, దాని చుట్టుపక్కల ఎంత వెతికినా కనిపించకపోవడంతో ఆందోళ చెందారు. వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు.నందిగామ రూరల్ సీఐ నాగేంద్రకుమార్, చందర్లపాడు ఎస్ ఐ రామకృష్ణ,  తహసిల్దార్ సుశీలాదేవి  గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలిసిన గ్రామస్తులు ఒక్కరొక్కరుగా అక్కడికి చేరుకున్నారు.

పల్లెకారులు, గజ ఈతగాళ్లు,  గ్రామస్తులు నదిలో పడవల సహాయంతో రాత్రివేళ వెతుకులాట ప్రారంభించారు.  నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో తీవ్రంగా గాలిస్తున్నారు .రాత్రి కావడంతో చీకట్లో వెతుకులాటకు ఇబ్బంది అవుతుంది. ముక్కుపచ్చలారని  చిన్నారులు మునేరులో గల్లంతవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రుల రోదనలతో ఆ ప్రాంతం శోక సంద్రంలో మునిగిపోయింది.  

Follow Us:
Download App:
  • android
  • ios