Asianet News TeluguAsianet News Telugu

డ్వాక్రా రుణమాఫీపై బహిరంగ చర్చకు సిద్ధమా:జగన్ కు మంత్రి పరిటాల సునీత సవాల్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు మంత్రి పరిటాల సునీత సవాల్ విసిరారు. డ్వాక్రా రుణమాఫీపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ మంత్రి జగన్ ను ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు చేయూతపై వేదిక ఏదైనా ఎక్కడైనా బహిరంగ చర్చకు తాను సిద్దమని జగన్ సిద్దమా అంటూ నిలదీశారు.  

minister paritala sunitha slams ys jaganmohanreddy
Author
Ananthapuram, First Published Oct 18, 2018, 12:02 PM IST

అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు మంత్రి పరిటాల సునీత సవాల్ విసిరారు. డ్వాక్రా రుణమాఫీపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ మంత్రి జగన్ ను ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు చేయూతపై వేదిక ఏదైనా ఎక్కడైనా బహిరంగ చర్చకు తాను సిద్దమని జగన్ సిద్దమా అంటూ నిలదీశారు.  

ఏపీ ప్రజల పాలిట మహిషాసురుడిలా జగనాసురుడు దాపురించారని మండిపడ్డారు మంత్రి పరిటాల సునీత. డ్వాక్రా రుణాలపై అవమానకరంగా మాట్లాడిన జగన్ కోటిమంది డ్వాక్రా మహిళలను అవమానించారని ధ్వజమెత్తారు. పసుపు కుంకుమ పథకం అవహేళన చేస్తూ జగన్ మాట్లాడటం ఆయన రాక్షసత్వానికి నిదర్శనమన్నారు. మరో పదిరోజుల్లో డ్వాక్రా మహిళల బ్యాంకు ఖాతాల్లోకి తుది విడత పసుపు కుంకుమ నిధులు జమ అవుతాయని స్పష్టం చేశారు. 

ఏపీ పాలిట మహిషాసురుడుగా ఉన్న జగన్ కు తగిన గుణపాఠం చెప్పనున్నారని మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో జగనాసురుడును మర్ధించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మంత్రి పరిటాల సునీత స్పష్టం చేశారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios