Asianet News TeluguAsianet News Telugu

మావోల ఘాతుకంపై లోకేష్ దిగ్భ్రాంతి

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమపై మావోయిస్టుల దాడిని మంత్రి నారా లోకేష్ ఖండించారు. మావోయిస్టుల ఘాతుకంపై లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తి వ్యక్తం చేశారు. 

Minister lokesh reaction on maoist attack
Author
Amaravathi, First Published Sep 23, 2018, 3:00 PM IST

అమరావతి: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమపై మావోయిస్టుల దాడిని మంత్రి నారా లోకేష్ ఖండించారు. మావోయిస్టుల ఘాతుకంపై లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తి వ్యక్తం చేశారు. మృతి చెందిన నేతల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కిడారి, సోమ కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. 

ఆదివారం గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనేందుకు సర్వేశ్వరరావు వెళ్తుండగా మావోలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతోపాటు మాజీ ఎమ్మెల్యే సివిరి సోమ మరణించారు. సుమారు ఈ దాడిలో సుమారు 50 మంది మావోయిస్టులు పాల్గొన్నారని పోలీసులు చెప్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios