గ్యాంగ్రేప్ బాధితురాలిని పరామర్శించిన మంత్రి బాలినేని
గ్యాంగ్ రేప్కు గురైన బాధితురాలిని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆదివారం నాడు పరామర్శించారు. బాధితురాలికి అవసరమైన వైద్య సహాయం అందించాలని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.
ఒంగోలు: గ్యాంగ్ రేప్కు గురైన బాధితురాలిని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆదివారం నాడు పరామర్శించారు. బాధితురాలికి అవసరమైన వైద్య సహాయం అందించాలని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.
మరో వైపు ఈ ఘటనకు పాల్పడిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్ చెప్పారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లని ఆయన చెప్పారు.
ఆర్టీసీ బస్టాండ్లో స్నేహితుడి కోసం ఎదురుచూస్తున్న మైనర్ బాలికకు మాయమాటలకు నమ్మించారు. ఈ నెల 17వ తేదీ నుండి 22వ తేదీవరకు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.