Asianet News TeluguAsianet News Telugu

వివేకా హత్య వెనుక భారీ కుట్రకోణం.. నిందితులకు బెయిలిస్తే సాక్షులకు ముప్పు.. సీబీఐ

వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు బెయిల్ మంజురు చేయవద్దని సీబీఐ న్యాయస్థానాన్ని కోరింది. వివేకా హత్య కేసులో భారీ కుట్రకోణం దాగి ఉందని తెలిపింది. 

massive conspiracy behind Vivekas murder says cbi to the high court
Author
Hyderabad, First Published May 13, 2022, 7:12 AM IST

అమరావతి : మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య వెనుక భారీ కుట్ర కోణం ఉందని దాన్ని తేల్చే కీలక దిశగా దర్యాప్తు సాగుతోందని సీబీఐ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులకు తీవ్ర ముప్పు ఉందని తెలిపారు. నిందితులకు బెయిల్ ఇవ్వరాదని సీబీఐతోపాటు వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాది విన్నవించారు. వివేకా హత్య కేసులో నిందితులు దేవి రెడ్డి శివ శంకర్ రెడ్డి (ఏ5), వై సునీల్ యాదవ్ (ఏ2), గజ్జల ఉమా శంకర్ రెడ్డి (ఏ3) బెయిల్ కోసం వేసిన వ్యాజ్యాలపై హైకోర్టు వేసవి సెలవుల ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి గురువారం విచారణ జరిపారు. 

హత్య కేసు దర్యాప్తు పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందో చెప్పాలని సీబీఐని కోరారు. దర్యాప్తు కొనసాగింపు కారణంగా నిందితులను ఎక్కువకాలం జ్యుడీషియల్ కస్టడీలో ఉంచలేం అన్నారు. దిగువ కోర్టుల్లో రెండు అభియోగపత్రం ఛార్జిషీట్ విశాఖ జరిగిన దర్యాప్తు పురోగతిపై వివరాలు సమర్పించాలని స్పష్టం చేశారు. విచారణను ఈనెల 19కి వాయిదా వేశారు. మొదట దేవిరెడ్డి శివశంకర్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టీ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ… పిటిషనర్లు 2021 నవంబర్ 17న అరెస్టు చేశారు. అప్రూవర్గా మారిన దస్తగిరి (ఏ4) చెప్పిన వాంగ్మూలం తప్ప పిటిషనర్ కు వ్యతిరేకంగా సాక్షాధారాలు లేవు. అభియోగపత్రం దాఖలు చేశాక సీబీఐ దర్యాప్తులో పురోగతి లేదు. ఎలాంటి షరతులు విధించిన పరవాలేదు.  బెయిల్ మంజూరు చేయండి’ అని కోరారు.  

దర్యాప్తు పూర్తి చేసి దిగువ కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారని బెయిలు మంజూరు చేయాలని మరో నిందితుడు గజ్జల ఉమా శంకర్ రెడ్డి తరఫు న్యాయవాది కె. చిదంబరం కోరారు. ఇప్పటికే రెండు అభియోగ పత్రాలు దాఖలు చేశారని దర్యాప్తును ఎంతకాలం కొనసాగిస్తారని న్యాయమూర్తి సీబీఐని ప్రశ్నించారు. వివేకా కుమార్తె సునీత ఆందోళనతో పాటు నిందితుల వ్యక్తిగత స్వేచ్ఛను తాము దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందని తెలిపారు. సీబీఐ న్యాయవాది చెన్నకేశవులు వాదనలు వినిపిస్తూ హత్య వెనుక భారీ కుట్ర కోణం ఉందని, పిటిషనర్ సాక్షులను బెదిరిస్తున్నారని, వారికి తీవ్ర ముప్పు ఉందని చెప్పారు. సిబిఐ అధికారుల డ్రైవర్ ను గుర్తు తెలియని వ్యక్తి బెదిరించారని, హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారిపైనే పోలీసులు కేసు నమోదు చేశారని న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. శివ శంకర్ రెడ్డి పై హత్య, హత్యాయత్నం, మహిళల ఆత్మ గౌరవానికి భంగం కలిగించడం తదితర సెక్షన్ల కింద మొత్తం 31 కేసులు ఉన్నాయి అన్నారు.  పిటిషనర్ల కు బెయిల్ ఇవ్వవద్దని కోరారు.

శివ శంకర్ రెడ్డి సాక్షులను బెదిరిస్తున్నారు
వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాది వెంకటేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. సీబీఐ రెండో ఛార్జిషీట్ వేశాక దేవిరెడ్డి శివశంకర్రెడ్డి పాత్ర ఉందని తేటతెల్లమైంది అన్నారు. శివశంకర్ రెడ్డి జైల్లో ఉంటూనే  సాక్షులను బెదిరిస్తున్నారని, సీబీఐని దర్యాప్తు చేయడం లేదని తెలిపారు. గతంలో సీబీఐ ముందు సాక్ష్యం ఇవ్వడానికి అంగీకరించిన వారు, ఆయన వల్ల ఇపుడు మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరించారని తెలిపారు. పోలీసులు సిబిఐకి సహకరించడం లేదని,  దర్యాప్తు పూర్తయి హత్య వెనుక కుట్రదారులు ఎవరో తేలే వరకు పిటిషనర్లు ఆ పిటిషన్లను కొట్టి వేయాలని కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios