Asianet News TeluguAsianet News Telugu

యువకుడితో చనువుగా ఉందని.. కోడలిని చంపిన మామ..!

కాగా.. ప్రియమణి.. తన కొడుక్కి అన్యాయం చేసి.. మరో యువకుడితో..  చనువుగా ఉంటోందని సత్యానారాయణ గుర్తించారు.

Man kills his daughter in law Over Illicit relationship
Author
Hyderabad, First Published Jul 31, 2021, 8:01 AM IST

తన కొడుకు కు తెలియకుండా.. తమ కోడలు మరో యువకుడితో చనువుగా ఉందని ఓ మామ  పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే..  కోడలిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో  చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మలికిపురం ప్రాంతానికి చెందిన  చొప్పల సత్యనారాయణ తన కుమారుడు విజయ్ కుమార్ కు ఏడేళ్ల క్రితం.. ప్రియమణి(25) అనే యువతితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నారు. విజయ్ కుమార్ ఉపాధి నిమిత్తం ఖతార్  వెళ్లాడు.

ప్రియమణి కుటుంబసభ్యులు... అండమాన్ లో ఉంటున్నారు. అయితే.. ప్రియమణి మాత్రం.. అత్తామామల తో కలిసి ఇక్కడే ఉంటోంది. కాగా.. ప్రియమణి.. తన కొడుక్కి అన్యాయం చేసి.. మరో యువకుడితో..  చనువుగా ఉంటోందని సత్యానారాయణ గుర్తించారు.

వారం క్రితం అతనితో పరారయ్యింది కూడా. ఆమె అలా లేచిపోయిందని సత్యానారాయణ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆమెను పట్టుకొని వచ్చి కొద్ది రోజులు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అయినా కోడలిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో  రగిలిపోయిన సత్యనారాయణ... కోడలిని చాక్ తో పొడిచి అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు.

Follow Us:
Download App:
  • android
  • ios