Asianet News TeluguAsianet News Telugu

పోలీసుల వేధింపులు.. యువకుడి ఆత్మహత్య, మృతదేహంతో పీఎస్ వద్ద బంధువుల ఆందోళన

కృష్ణా జిల్లా కంకిపాడులో యువకుడి ఆత్మహత్య వ్యవహారం కలకలం రేపుతోంది. అరవింద్ అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే పోలీసుల వేధింపులు, బాబాయ్ భార్య పెడుతోన్న ఇబ్బందుల వల్ల తాను చనిపోతున్నట్లు బాధితుడు సూసైడ్ నోట్‌లో రాశాడు. 
 

man commits suicide in kankipadu, family members protest with dead body at police station
Author
Vijayawada, First Published Aug 6, 2022, 3:56 PM IST

కృష్ణా జిల్లా కంకిపాడు పీఎస్ దగ్గర శనివారం ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి.  అరవింద్ అనే యువకుడి మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అరవింద్ మృతికి పోలీసులే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసుల వేధింపులు, బాబాయ్ భార్య పెడుతున్న ఇబ్బందుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని అరవింద్ సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు. కోటి, మురళి అనే ఇద్దరు కానిస్టేబుల్స్ తనను వేధించారని సూసైడ్ నోట్‌లో రాశాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అరవింద్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios