Asianet News TeluguAsianet News Telugu

ఏలూరులో కలకలం: మహిళను హత్య చేసి సూసైడ్ చేసుకున్న వ్యక్తి

ఏలూరులో మహిళను హత్య చేసిన నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ ఘటన  స్థానికంగా కలకలం రేపుతుంది.
 

Man Commits Suicide After Woman  killed in Eluru District lns
Author
First Published Aug 28, 2023, 4:19 PM IST

ఏలూరు: జిల్లా కేంద్రంలోని దక్షిణ వీధిలో  మహిళ హత్యకు గురైంది.  మహిళను హత్య చేసిన నిందితుడు  నూజీవీడు  రైల్వేస్టేషన్  వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఏలూరులో జిల్లా కేంద్రంలో  ఓ మహిళ హత్యకు గురైన విషయం  సోమవారంనాడు వెలుగు చూసింది.  నిన్న ఈ మహిళ హత్యకు గురైందని  పోలీసులు అనుమానిస్తున్నారు.  అయితే ఈ మహిళను హత్య  చేసినట్టుగా అనుమానిస్తున్న నిందితుడు నూజీవీడు రైల్వే స్టేషన్ సమీపంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  

మహిళను హత్య చేసిన తర్వాత నిందితుడు ఆత్మహత్య చేసుకొన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. వివాహేతర సంబంధమే వీరి ద్దరి మరణానికి కారణంగా  పోలీసులు అనుమానిస్తున్నారు.   ఏలూరులోని సత్యనారాయణ  అనే వ్యక్తి నివాసంలో  ఓ మహిళ  హత్యకు గురైంది.  హత్యకు గురైన  మహిళ సుజాతగా  గుర్తించారు. సత్యనారాయణ అనే వ్యక్తి నూజీవీడు రైల్వేస్టేషన్ వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

నిన్న  మధ్యాహ్నం  పనిచేసే  దుకాణం నుండి లంచ్ కోసం బయటకు వెళ్లిన సుజాత  కన్పించకుండా పోయింది. ఇవాళ ఉదయం ఆమె  రక్తపు మడుగులో కన్నించడంతో  స్థానికులు షాక్ కు గురౌతున్నారు. నిన్న సాయంత్రం నుండి  సుజాత కోసం  గాలింపు చర్యలు చేపట్టినా ఆమె ఆచూకీ లభ్యం కాలేదని సుజాత  కుటుంబ సభ్యులు చెప్పారు.  ఈ ఘటనకు సంబంధించి  పోలీసులు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios