Asianet News TeluguAsianet News Telugu

తిరుమల ఆలయం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం, పరుగులు తీసిన భక్తులు

తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఆదివారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో కలకలం రేగింది. దీంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే స్పందించిన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అతనిని అడ్డుకున్నారు. 

 man attempts suicide in tirumala temple premises
Author
Tirumala, First Published Jun 19, 2022, 6:41 PM IST

నిత్యం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైయున్న తిరుమల ఆలయం వద్ద ఆదివారం కలకలం రేగింది. ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దక్షిణమాడ వీధిలో ఈ ఘటన జరిగింది. వెంటనే స్పందించిన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, పోలీసులు అతడిని అడ్డుకున్నారు. అయితే బాధితుడు మతిస్థిమితం లేని వ్యక్తిగా తెలుస్తోంది. ఈ ఘటనతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios