Asianet News TeluguAsianet News Telugu

పల్నాడులో దారుణం.. 30 సెంట్ల స్థలం కోసం అన్న కూతురిని కత్తితో నరికి, బాబాయ్‌ ఘాతుకం

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం యన్నాదేవీలో అన్నకూతురిని బాబాయ్ కత్తితో నరికాడు. కేవలం 30 సెంట్ల భూమి కోసం ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. 

man attacked his daughter in palnadu district
Author
Sattenapalle, First Published Jun 21, 2022, 6:40 PM IST

మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ఆస్తుల కోసం అయిన వారినే అంతం చేస్తున్నారు. కేవలం 30 సెంట్ల స్థలం కోసం ఓ వ్యక్తి ఉన్మాదిగా మారిపోయాడు. కూతురి వయసయ్యే యువతి పైనే కత్తి దూశాడు. నడిరోడ్డు మీద విచక్షణారహితంగా కత్తితో నరికాడు. పల్నాడు జిల్లా (palnadu distrirct) సత్తెనపల్లి (sattenapalle) మండలం యన్నాదేవీలో జరిగింది ఈ కిరాతక పర్వం ఆస్తి వివాదంలో అన్న కూతురిపైనే బాబాయ్ దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్ధితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios