పల్నాడులో దారుణం.. 30 సెంట్ల స్థలం కోసం అన్న కూతురిని కత్తితో నరికి, బాబాయ్ ఘాతుకం
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం యన్నాదేవీలో అన్నకూతురిని బాబాయ్ కత్తితో నరికాడు. కేవలం 30 సెంట్ల భూమి కోసం ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.
మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ఆస్తుల కోసం అయిన వారినే అంతం చేస్తున్నారు. కేవలం 30 సెంట్ల స్థలం కోసం ఓ వ్యక్తి ఉన్మాదిగా మారిపోయాడు. కూతురి వయసయ్యే యువతి పైనే కత్తి దూశాడు. నడిరోడ్డు మీద విచక్షణారహితంగా కత్తితో నరికాడు. పల్నాడు జిల్లా (palnadu distrirct) సత్తెనపల్లి (sattenapalle) మండలం యన్నాదేవీలో జరిగింది ఈ కిరాతక పర్వం ఆస్తి వివాదంలో అన్న కూతురిపైనే బాబాయ్ దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్ధితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది.