Asianet News TeluguAsianet News Telugu

పందిమాంసం గొడవ.. విచక్షణ కోల్పోయి.. మాంసం కోసే కత్తితో కన్నబిడ్డనే కడతేర్చాడు..

తండ్రీ కొడుకులూ ఇద్దరూ మద్యానికి బానిసలై తరచూ గొడవపడుతుండేవారు. శుక్రవారం రాత్రి లవకుశ పందిమాంసం కోసి అమ్ముతుండగా, అక్కడికి వచ్చిన కుమారుడు నాగరాజు అమ్మిన సొమ్ములో తనకు వాటా కావాలని అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలయ్యింది. 

man assassinated son over money conflict in srikakulam
Author
Hyderabad, First Published Dec 25, 2021, 6:35 AM IST

టెక్కలి : రక్తం పంచుకుని పుట్టిన బిడ్డనే తన చేతులతో పొడిచి murder చేశాడో కసాయి తండ్రి.. liquor మత్తులో తలెత్తిన గొడవలో ఏం చేస్తున్నాడోనన్న విచక్షణ కోల్పోయి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి టెక్కలిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... పట్టణంలోని భూలోకమాత వీధిలో పెయింటింగ్ పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు బిసాయి నాగరాజు (28). 

అతని తండ్రి లవకుశ పూలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ తండ్రీ కొడుకులూ ఇద్దరూ మద్యానికి బానిసలై తరచూ గొడవపడుతుండేవారు. శుక్రవారం రాత్రి లవకుశ పందిమాంసం కోసి అమ్ముతుండగా, అక్కడికి వచ్చిన కుమారుడు నాగరాజు అమ్మిన సొమ్ములో తనకు వాటా కావాలని అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య scuffle మొదలయ్యింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న లవకుశ, తన చేతిలో ఉన్న Meat  కోసే కత్తితో కొడుకు పొట్టలో, పక్కటెముకల వద్ద విచక్షణా రహితంగా పొడిచాడు. 

దీన్ని గమనించిన తల్లి, సోదరి నాగరాజుును 108లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ఎస్సై కామేశ్వరరావు మృతదేహాన్ని పరిశీలించి కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. రాత్రి డీఎస్పీ శివరామిరెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. 

చావులోనూ వెంటే.. భార్య మరణించిన గంట వ్యవధిలోనే భర్త కూడా..

ఇదిలా ఉండగా, Nalgonda జిల్లాలో దారుణం జరిగింది.తన ఇద్దరు చిన్నారులను చంపేసి.. తానూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ తండ్రి. పిల్లలకు కూల్ డ్రింక్‌లో విషం కలిపి ఇచ్చి చంపినట్టు సమాచారం. ఈ ఘటన నల్లగొండ జిల్లా దామరచర్లలలోని నూనావంత్ తండాలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఇద్దరు కొడుకులు, భర్త చనిపోవడంతో భార్య శోకసంద్రంలో మునిగిపోయింది.

నూనావంత్ తండాకు చెందిన గేరు కిషన్(35), భూలక్ష్మి దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు హర్షవర్దన్(8), అఖిల్(6)లు ఉన్నారు. తండాలో కిషన్‌కు ఒక ఎకరం పొలం ఉన్నది. ఇది సాగు చేసి కుటుంబ బాధ్యతలు నెరవేర్చేవాడు. ఆర్థిక సమస్యల కారణంగా దంపతుల మధ్య గొడవలు జరిగేవి. బతుకు దెరువు కోసం మూడేళ్ల క్రితం భార్యాపిల్లలతో కలిసి కిషన్ మిర్యాలగూడకు వెళ్లాడు. అక్కేడ ఆటో నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు. ఇటీవలే వారు మళ్లీ స్వగ్రామానికి తిరిగి వచ్చారు. 

గురువారం పిల్లలు బడి నుంచి ఇంటికి రాగానే కిషన్ ఆటో స్టార్ట్ చేశాడు. కొత్త బట్టలు కొనిస్తానని, మిర్యాలగూడకు వెళ్దామని పిల్లలతో చెప్పాడు. కొత్త బట్టలు అనగానే పిల్లలు ఎగిరి గంతేశారు. రెడీ అయి ఆటో ఎక్కారు. మిర్యాలగూడకు వెళ్తామని ఇంటి నుంచి బయల్దేరి వెళ్లిన పిల్లలు, భర్త రాత్రి వరకూ రాకపోయే సరికి ఇరుగు పొరుగులో రాత్రిపూట వారి జాడ కోసం వెతికారు. కానీ, ఫలితం లేకపోయింది. అయితే, శుక్రవారం ఉదయం పొలాలకు వెళ్లిన స్థానికు రైతులకు చిన్నారులు ఇద్దరూ విగత జీవులై పడి ఉండగా, కిషన్ బాడీ ఉరితాడుకు వేళాడుతూ కనిపించింది. దీంతో రైతులు వెంటనే వారి కుటుంబ సభ్యులకు, పోలీసులకు విషయాన్ని చేరవేసింది. ఇద్దరు పిల్లలకు కూల్ డ్రింక్‌లో విషం కలిపి ఇచ్చి చంపేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాతే తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios