ప్రియుడి అపార్ట్ మెంట్ పై నుండి దూకి... ప్రియురాలు ఆత్మహత్య
ప్రేమించిన వాడితో గొడవపడి ఓ యువతి ఐందస్తుల భవనంపై నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద సంఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది.
పెందుర్తి: ప్రేమించిన వాడితో గొడవపడి ఓ యువతి ఐందస్తుల భవనంపై నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద సంఘటన విశాఖ జిల్లా పెందుర్తిలో చోటుచేసుకుంది. ప్రియుడు నివాసముండే అపార్టుమెంట్ పై నుండే యువతి దూకి బలవన్మరణానికి పాల్పడింది.
ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఒరిస్సా రాష్ట్రం రాయగడ్ ప్రాంతానికి చెందిన కావేటి వైష్ణవి(22) విశాఖలో ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తోంది. ఈమెకు చినముషిని వాడ ప్రాంతానికి చెందిన షణ్ముక తేజతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వీరి మద్య కొంతకాలం సాఫీగా సాగిన ప్రేమాయణం రాను రాను గొడవలకు దారితీసింది.
ఈ క్రమంలోనే వైష్ణవి గురువారం మధ్యాహ్నం తన ప్రియుడు నివసించే అపార్ట్మెంట్ కు వచ్చింది. అయితే మళ్లీ వీరిద్దరి మధ్య గొడవ జరిగడంతో క్షణికావేశంలో వైష్ణవి దారుణానికి పాల్పడింది. అదే అపార్ట్మెంట్ లోని ఐదో అంతస్తుపై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకున్న పెందుర్తి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యువతి ప్రియుడిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.