రావులపాలెంలో అర్థరాత్రి కాల్పుల కలకలం
ఆంధ్రప్రదేశ్ లోని రావులపాలెంలో ఆదివారం గుర్తు తెలియని దుండగులు ఓ వ్యాపారి, ఆయన కుమారుడిపై కాల్పులకు తెగబడ్డాడు. వారి అరుపులకు చుట్టుపక్కలవారు రావడంతో పారిపోయారు.
కోనసీమ : రావులపాలెంలో ఆదివారం అర్ధరాత్రి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఫైనాన్స్ వ్యాపారి సత్యనారాయణ రెడ్డిపై ఇద్దరు దుండగులు దాడి చేశారు. ఈ క్రమంలో ఆయన కుమారుడు ఆదిత్య రెడ్డి దుండగులను ప్రతిఘటించారు. దీంతో దుండగులు గాల్లోకి కాల్పులు జరిపారు. బాధితులు కేకలు వేయడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. దుండగులు పారిపోతుండగా వారి వద్ద నుంచి ఓ సంచీ పడిపోయింది. దానిని పరిశీలించగా అందులో రెండు నాటుబాంబులు, జామర్ ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.