ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో లగడపాటి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ నెల 27వ తేదీన జరిగే శుభకార్యానికి లగడపాటి చంద్రబాబును ఆహ్వానించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

అమరావతి: మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ సర్వేను విడుదల చేసి ఆయన తీవ్ర విమర్శలకు గురైన విషయం తెలిసిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో లగడపాటి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ నెల 27వ తేదీన జరిగే శుభకార్యానికి లగడపాటి చంద్రబాబును ఆహ్వానించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ మీద మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. 

తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా లగడపాటి విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ సర్వే తప్పుల తడకగా తేలిన విషయం తెలిసిందే. ఆయన విడుదల చేసిన ఫలితాలకు భిన్నంగా అసలు ఫలితాలు వెలువడ్డాయి.