Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ జగన్ ని కలిసిన సీఎం కుమారుడు

తాను జగన్ ని మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశానని ఆయన చెప్పడం గమనార్హం.
 

karanataka CM kumaraswami's son nikhil meets YS Jagan
Author
Hyderabad, First Published Jun 11, 2019, 4:15 PM IST

ఏపీ నూతన ముఖ్య మంత్రి వైఎస్ జగన్ ని  కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం తాడేపల్లిలోని  జగన్ నివాసానికి వచ్చిన నిఖిల్ గౌడను సాదరంగా ఆహ్వానించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జగన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుభాకాంక్షలు చెప్పేందుకు నిఖిల్ గౌడ వచ్చారు.

ఈ సందర్భంగా నిఖిల్ గౌడ, జగన్ కాసేపు ముచ్చటించారు. పలు విషయాలపై చర్చించినట్లు సమాచారం. కాగా... తాను జగన్ ని మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశానని ఆయన చెప్పడం గమనార్హం.

లోక్‌ సభ ఎన్నికల్లో కర్ణాకటలోని మండ్య లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన నిఖిల్‌ ఘోరంగా ఓటమి పాలయ్యారు.  మండ్యలో బీజేపీ మద్దతుతో పోటీ చేసిన సుమలత అంబరీష్‌ నిఖిల్‌పై గెలుపొందారు. 

karanataka CM kumaraswami's son nikhil meets YS Jagan

Follow Us:
Download App:
  • android
  • ios