ఇటీవలే తెలంగాణలో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తానని, ఆ తరువాత బీజేపీకి మద్దతు ఇస్తా అని నిలకడ లేని మనస్థత్వం ఎంటని ప్రశ్నించాడు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన కామెంట్స్ చేశారు. త్వరలో తిరుపతి ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ నేపథ్యంలో పవన్ పై కేఏ పాల్ విమర్శల వర్షం కురిపించారు.
కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవకుండానే.. పవన్ ఏడు పార్టీలు మారాడని.. ఆ ఘనత కేవలం పవన్ కే దక్కిందని కేఏ పాల్ ఎద్దేవా చేశారు. ‘‘ఓరిజినల్ పార్టీ ప్రజారాజ్యం.. తరువాత కాంగ్రెస్లో చేరారు. తరువాత సీపీఐ సీపీఎం.. ఆ తరువాత బీఎస్పీ మాయావతి కాళ్లపై పడ్డావ్ తమ్ముడూ.. మరలా బీజేపీ అన్నావ్.. మళ్లీ ఇప్పుడు బీజేపీ అంటున్నావ్’’ అని విమర్శించారు.
ఇటీవలే తెలంగాణలో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తానని, ఆ తరువాత బీజేపీకి మద్దతు ఇస్తా అని నిలకడ లేని మనస్థత్వం ఎంటని ప్రశ్నించాడు. ఈ సంద్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ... ‘‘నీకు 5 శాతం ఓటు బ్యాంక్ ఉంది కదా.. బీజేపీకి ఒక్కశాతం కూడా ఓటింగ్ లేదు. నువ్వు బీజేపీ ఏజెంట్ కాకపోతే తిరుపతిలో ఖచ్చితంగా పోటీ చేసేవాడివి. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడో గమనించండి’’ అని చెప్పుకొచ్చారు.
‘ కుటుంబ సభ్యులను కూడా రాజకీయాల్లో ఎందుకు లాగుతావ్.. నిజంగా నీకు సేవ చేయాలి అని ఉంటే నువ్వు తిరుపతి బై పోల్లో నిలబడు.. లేదంటే మీ అన్నని నిలబెట్టు.. నీ పార్టీకి సంబంధించిన ఏ వ్యక్తినైనా నిలబెట్టు అని హితవు పలికారు. అప్పుడు నువ్ బీజేపీ ఏజెంట్ కాదని రుజువు చేసుకో ’ అంటూ పవన్ కి సవాల్ విసిరారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 8, 2021, 10:19 AM IST