Janmashtami 2022 : రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్ జగన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
శ్రీ కృష్ణజన్మాష్టమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి : శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం శుభాకాంక్షలు తెలిపారు. ‘మానవాళికి కర్తవ్యబోధ చేసిన భగవద్గీత.. సన్మార్గానికి కలకాలం అండగా ఉంటుంది. అటువంటి భగవద్గీతను ప్రసాదించిన భగవాన్ శ్రీకృష్ణుడి పుట్టినరోజు అందరికీ పర్వదినం. ప్రపంచానికి గీతను బోధించి, ప్రేమ తత్వాన్ని పంచిన శ్రీకృష్ణుని కృపా కటాక్షాలు మనందరి మీదా సదా ఉండాలని కోరుకుంటున్నాను’అని సీఎం పేర్కొన్నారు.