టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ.. ఏపీ రాజకీయాల్లో కలకలం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. వీరిద్దరి భేటీ నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి.
![janasena chief pawan kalyan meets tdp chief chandrababu naidu ksp janasena chief pawan kalyan meets tdp chief chandrababu naidu ksp](https://static-ai.asianetnews.com/images/01gz6j1jpcf3wbfc29jc6z8fm3/whatsapp-image-2023-04-29-at-6-37-20-pm-jpeg_363x203xt.jpg)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. శనివారం చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్.. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్ధితులపై చర్చిస్తున్నారు. వీరిద్దరి భేటీ నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఈ మధ్యకాలంలో చంద్రబాబుతో పవన్ సమావేశం కావడం ఇది మూడోసారి. ఇటీవల ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చంద్రబాబుపై వైసీపీ నేతలు దాడి చేసిన నేపథ్యంలో పవన్ ఈయనకు సంఘీభావం తెలిపారు.