విజయవాడలోని ప్రముఖ జువెల్లరీ షాప్ లో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు.
విజయవాడలో ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. బందరు రోడ్డులోని ఆంజనేయ జువెల్లర్స్ లో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు. కేంద్ర బలగాల భద్రత నడుమ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. బంగారం అక్రమ రవాణా, పన్ను ఎగవేతకు పాల్పడినట్లు అనుమానిస్తూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది.
Add Asianetnews Telugu as a Preferred Source

ఐటీ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి జువెల్లర్స్ లో సోదాలు నిర్వహిస్తున్నారు. బంగారం క్రయవిక్రయాలకు సంబంధించిన సాప్ట్, హార్డ్ కాపీలను పరిశీలిస్తున్నారు. ఉదయం నుండి ఆంజనేయ జువెల్లర్స్ లో సోదాలు కొనసాగుతూనే వున్నాయి.
వీడియో
