టీడీపీ కార్యకర్తల అరెస్ట్, పోలీసుల చిత్రహింసలు... వెల్దుర్తి పీఎస్ వద్ద ఉద్రిక్తత
పల్నాడు జిల్లా వెల్దుర్తి పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ కార్యకర్తలను ఎందుకు హింసించారో చెప్పాలంటూ మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి రంగారెడ్డి పోలీసులను ప్రశ్నించారు.
పల్నాడు జిల్లా వెల్దుర్తి పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. అరెస్ట్ చేసిన తమ కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తమ కార్యకర్తలను ఎందుకు హింసించారో చెప్పాలంటూ మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి రంగారెడ్డి పోలీసులను ప్రశ్నించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.