వైసీపీ మొదటి జాబితాలో ఐదు ఎస్సీ రిజర్వుడ్ స్థానాల్లో అభ్యర్థులను మార్చగా.. నాలుగో జాబితాకు వచ్చేసరికి ఏకంగా 8 చోట్ల ఎస్సీ అభ్యర్థులను మార్చేశారు. నాలుగో జాబితాలో ప్రకటించిన తొమ్మిది స్థానాల్లో 8 ఎస్సీ స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చేశారు. 

తాడేపల్లి : అధికార వైసీపీలో వరుసగా నియోజకవర్గ ఇన్చార్జ్ ల లిస్టులు విడుదల అవుతూనే ఉన్నాయి. నాలుగో జాబితా ఫైనల్ అనుకున్న క్రమంలో.. మరో రెండు జాబితాలు ఉండనున్నట్లుగా తెలుస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైసిపి పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే సర్వేలను, సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్న వారిని కఠినంగా పక్కన పెట్టేస్తున్నారు వైఎస్ జగన్. ఈ క్రమంలోనే ఇప్పటివరకు నాలుగు జాబితాలను విడుదల చేశారు. ఇందులో ఎమ్మెల్యే, ఎంపీ నియోజకవర్గాల ఇన్చార్జులు ఉన్నారు.

డిసెంబర్ 11 నుంచి.. జనవరి 18 వరకు 4 విడతలుగా 68 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేశారు. మార్చిన నియోజకవర్గాల్లో ఎక్కువగా ఎస్ టి, ఎస్ సి రిజర్వ్ డ్ స్థానాలే ఎక్కువగా ఉన్నాయి. వైసీపీకి బలమైన ఓటు బ్యాంకు గా ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటు బ్యాంకులను పదిలం చేసుకునే వ్యూహంతోనే ఈ మార్పులు, చేర్పులు జరుగుతున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు ఖరాలైన అభ్యర్థులను లిస్టుల వారిగా చూస్తే.. 

వైసిపి మొదటి లిస్టులో అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలుగా ఫైనల్ అయిన వారు వీరే..

నెం.నియోజకవర్గంఅభ్యర్థి
1ప్రతిపాడు (ఎస్సీ)బాలసాని కిరణ్ కుమార్
2.కొండేపి (ఎస్సీ)డాక్టర్ ఆదిమూలపు సురేష్
3.వేమూరు (ఎస్సీ)వరికూటి అశోక్ బాబు
4.తాడికొండ మేకతోటి సుచరిత
5.సంతనూతలపాడుడాక్టర్ మేరుగు నాగార్జున
6.చిలకలూరిపేటమల్లెల రాజేష్ నాయుడు
7.గుంటూరు పశ్చిమవిడుదల రజిని
8.అద్దంకిపాణెం హనిమిరెడ్డి
9.మంగళగిరిగంజి చిరంజీవి
10.రేపల్లెఈ వూరు గణేష్ 
11.గాజువాక వరికూటి రామచంద్రరావు

రెండో జాబితాలో..

నెం.నియోజకవర్గంఅభ్యర్థి
1.అనంతపురం (ఎంపీ)మాల గుండ్ల శంకరనారాయణ
2.హిందూపురం (ఎంపీ)జోలదరాశి శాంత
3.అరకు (ఎంపీ) (ఎస్సీ)కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి
4.రాజాం ( ఎస్సీ)తాలె రాజేష్ 
5. అనకాపల్లి మలసాల భరత్ కుమార్
6.పాయకరావుపేట ( ఎస్సీ)కంబాల జోగులు
7.రామచంద్రపురంపిల్లి సూర్యప్రకాష్
8.పి. గన్నవరం ( ఎస్సీ) విప్పర్తి వేణుగోపాల్
9.పిఠాపురం వంగా గీత
10.జగ్గంపేటతోట నరసింహం
11.ప్రతిపాడువరుపుల సుబ్బారావు
12రాజమండ్రి సిటీమార్గాని భరత్
13.రాజమండ్రి రూరల్చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
14.పోలవరం (ఎస్టి)తెల్లం రాజ్యలక్ష్మి
15.కదిరిబిఎస్ మక్బూల్ అహ్మద్
16.ఎర్రగొండపాలెం ( ఎస్సీ)తాటిపర్తి చంద్రశేఖర్
17.ఎమ్మిగనూర్మాచాని వెంకటేష్
18.తిరుపతిభూమన అభినయ్ రెడ్డి
19.గుంటూరు ఈస్ట్షేక్ నూరి ఫాతిమా
20.మచిలీపట్నంపేర్ని కృష్ణమూర్తి
21.చంద్రగిరిచెవిరెడ్డి మోహిత్ రెడ్డి
22.పెనుగొండకె.వి. ఉషా శ్రీ చరణ్
23.కళ్యాణదుర్గంతలారి రంగయ్య
24.అరకు (ఎస్టీ)గొడ్డేటి మాధవి
25.పాడేరు (ఎస్టీ)మత్స్యరాస విశ్వేశ్వర రాజు
26విజయవాడ సెంట్రల్వెల్లంపల్లి శ్రీనివాసరావు
27.విజయవాడ వెస్ట్షేక్ అసిఫ్

వైసీపీ మూడో జాబితా...

నెం.నియోజకవర్గంఅభ్యర్థి
1.శ్రీకాకుళం (ఎంపీ)పేరాడ తిలక్
2.విశాఖపట్నం (ఎంపీబొత్స ఝాన్సీ లక్ష్మి
3.ఏలూరు (ఎంపీ)కారుమూరి సునీల్ కుమార్ యాదవ్
4.విజయవాడ (ఎంపీ)కేశినేని నాని
5.కర్నూలు (ఎంపీ)గుమ్మనూరి జయరాజ్
6.తిరుపతి (ఎంపీ)కోనేటి ఆదిమూలం
7.ఇచ్చాపురంపిరియా విజయ
8.టెక్కలిదువ్వాడ శ్రీనివాస్
9.చింతలపూడి (ఎస్సీ) కంభం విజయ రాజ్
10.రాయదుర్గంమెట్టు గోవిందరెడ్డి
11.దర్శిబూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
12.పూతలపట్టు (ఎస్సీమూతిరేకుల సునీల్ కుమార్
13.చిత్తూరువిజయానంద రెడ్డి
14.మదనపల్లెనిస్సార్ అహ్మద్
15.రాజంపేటఆకెపాటి అమర్నాథ్ రెడ్డి
16.ఆలూరుబూసినే విరూపాక్షి
17.కొడుమూరు ( ఎస్సీ)డాక్టర్ సతీష్ 
18.గూడూరు ( ఎస్సీ)మేరీగ మురళి
19.సత్యవేడు ( ఎస్సీ)మద్దిల గురుమూర్తి
20. పెనుమలూరుజోగి రమేష్
21.పెడనఉప్పాల రాము 

ఈ లిస్టులో దీనితోపాటు ప్రస్తుతం ఇచ్చాపురం జడ్పిటిసిగా పనిచేస్తున్న ఉప్పాడ నారాయణమ్మను శ్రీకాకుళం జడ్పీ చైర్మన్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

నాలుగో జాబితాలో…

నెం.నియోజకవర్గంఅభ్యర్థి
1.చిత్తూరు ( ఎంపీ) ( ఎస్సీ)కే నారాయణస్వామి
2.జి.డి. నెల్లూరు ( ఎస్సీ)ఎన్ రెడ్డప్ప
3.శింగనమల ( ఎస్సీ)ఎం వీరాంజనేయులు
4.నందికొట్కూరు ( ఎస్సీ)డాక్టర్ సుధీర్ దారా
5.తిరువూరు( ఎస్సీ)నల్లగట్ల స్వామి దాస్
6.మడకశిర ( ఎస్సీ) ఈర లక్కప్ప
7.కొవ్వూరు ( ఎస్సీ)తలారి వెంకట్రావు
8.గోపాలపురం ( ఎస్సీ) తానేటి వనిత
9.కనిగిరిదద్దాల నారాయణ యాదవ్

మొదటి జాబితాలో ఐదు ఎస్సీ రిజర్వుడ్ స్థానాల్లో అభ్యర్థులను మార్చగా.. నాలుగో జాబితాకు వచ్చేసరికి ఏకంగా 8 చోట్ల ఎస్సీ అభ్యర్థులను మార్చేశారు. నాలుగో జాబితాలో ప్రకటించిన తొమ్మిది స్థానాల్లో 8 ఎస్సీ స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చేశారు. ఈ మార్పులు జరిగిన నియోజకవర్గాల్లోని రిజర్వుడు స్థానాల్లో స్థానచలనం కల్పిస్తే ఓసీలు ఉన్నచోట సిట్టింగ్ ల వారసులకు చోటు కల్పించారు. మొత్తంగా ఇప్పటివరకు జరిగిన మార్పులను చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే పెద్ద ఎత్తున మార్పులు జరిగాయి. ఈ మేరకు అభ్యర్థుల్ని మార్చేయడం, లేదా సీటు నిరాకరించడం చేశారు. రానున్న ఇంకొన్ని లిస్టుల్లో ఇంకా ఎంతమందికి స్థానచలనం జరుగుతుందో, ఎంతమంది పార్టీ మారతారో, ఇంకెంతమంది కొత్తగా వచ్చి చేరతారో వేచి చూడాల్సిందే.