ఏలూరు జిల్లా : రెస్టారెంట్పై పేలిన హీలియం బెలూన్.. చిన్నారులకు గాయాలు
ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో ఓ రెస్టారెంట్పై ఏర్పాటు చేసిన హీలియం బెలూన్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు తీవ్రగాయాల పాలయ్యారు.
ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో హీలియం గ్యాస్ బెలూన్ పేలింది. ఓ రెస్టారెంట్పై హీలియం గ్యాస్ బెలూన్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఈ క్రమంలో మంగళవారం బెలూన్ పేలి.. మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే విజయవాడ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, పోలీస్ శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.