విశాఖ ఉత్సవ్లో ఎయిర్ షో రద్దు కేంద్రం పనే: బాబు
విశాఖ ఉత్సవ్ లో ఎయిర్షో నిర్వహించకుండా కేంద్రం అడ్డుకొందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఉద్దేశ్యపూర్వకంగానే విశాఖ ఉత్సవ్ లో ఎయిర్షో ను నిర్వహించకుండా అడ్డుకొన్నారన్నారు.
అమరావతి:విశాఖ ఉత్సవ్ లో ఎయిర్షో నిర్వహించకుండా కేంద్రం అడ్డుకొందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఉద్దేశ్యపూర్వకంగానే విశాఖ ఉత్సవ్ లో ఎయిర్షో ను నిర్వహించకుండా అడ్డుకొన్నారన్నారు.
శుక్రవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు.విశాఖ ఉత్సవ్లో ఎయిర్ షో ట్రైల్స్ తర్వాత రద్దు చేశారని విమర్శించారు.ఇదే అంశంపై టీడీపీ ఎంపీలు కూడ కేంద్రం తీరును తప్పుబట్టారు. కక్ష సాధింపులో భాగంగా ఎయిర్ఫోర్స్ విన్యాసాలను ఆపారన్నారు.
దేశంలో ఏపీ రాష్ట్రం భాగం కాదా అని ఆయన ప్రశ్నించారు. గతంలో కూడ విరాట్ షిప్ విషయంలో కేంద్రం పక్షపాతంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. ఈ షిప్ ను ఏపీకి కేటాయించాలని మూడు ధరఖాస్తు చేస్తే మహారాష్ట్రకు కేటాయించారని టీడీపీ ఎంపీలు ఆరోపించారు.