మహేష్ హత్య కేసు: గోవాలో ఇద్దరి అరెస్ట్, మహిళ వ్యవహరమే హత్యకు కారణమా?
నగరంలోని కమిషనరేట్ కార్యాలయంలో పనిచేసే మహేష్ హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా పోలీసులు ఈ విషయమై సమాచారం ఇవ్వడంతో విజయవాడ పోలీసులు గోవాకు బయలుదేరారు. ఓ మహిళ కారణంగానే ఈ హత్యకు కారణంగా పోలీసులు చెబుతున్నారు.
విజయవాడ: నగరంలోని కమిషనరేట్ కార్యాలయంలో పనిచేసే మహేష్ హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా పోలీసులు ఈ విషయమై సమాచారం ఇవ్వడంతో విజయవాడ పోలీసులు గోవాకు బయలుదేరారు. ఓ మహిళ కారణంగానే ఈ హత్యకు కారణంగా పోలీసులు చెబుతున్నారు.
సీపీ కార్యాలయ ఉద్యోగి మహేష్ పై కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులను గోవా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ విషయమై విజయవాడ పోలీసులకు సమాచారం అందింది. గోవాకు విజయవాడ పోలీసులు బయలుదేరారు. గోవాకు వెళ్లాల్సిన విమానం మిస్ కావడంతో విజయవాడ పోలీసులు హైద్రాబాద్ ఎయిర్ పోర్టులో ఉన్నారు.
also read:బెజవాడలో మహేష్ హత్య కేసులో ట్విస్ట్: కారు రివర్స్ చేసి..
ఓ మహిళ విషయమై మహేష్ హత్య జరిగినట్టుగా పోలీసులు చెబుతున్నారు. సాత్విక్ రెడ్డి ఈ విషయంలో కీలకంగా వ్యవహరించినట్టుగా పోలీసులు తెలిపారు.
ఈనెల 10వ తేదీ రాత్రి విజయవాడలో కాల్పులు జరగడంతో మహేష్ మరణించాడు. మహేష్ ను హత్య చేసిన తర్వాత ఇద్దరు నిందితులు గోవాకు పారిపోయారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.