Asianet News TeluguAsianet News Telugu

మహేష్ హత్య కేసు: గోవాలో ఇద్దరి అరెస్ట్, మహిళ వ్యవహరమే హత్యకు కారణమా?

నగరంలోని కమిషనరేట్ కార్యాలయంలో పనిచేసే మహేష్ హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా పోలీసులు ఈ విషయమై సమాచారం ఇవ్వడంతో విజయవాడ పోలీసులు గోవాకు బయలుదేరారు. ఓ మహిళ కారణంగానే ఈ హత్యకు కారణంగా పోలీసులు చెబుతున్నారు.

goa police held two for killing mahesh in vijayawada lns
Author
Vijayanagar, First Published Oct 14, 2020, 2:49 PM IST


విజయవాడ: నగరంలోని కమిషనరేట్ కార్యాలయంలో పనిచేసే మహేష్ హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా పోలీసులు ఈ విషయమై సమాచారం ఇవ్వడంతో విజయవాడ పోలీసులు గోవాకు బయలుదేరారు. ఓ మహిళ కారణంగానే ఈ హత్యకు కారణంగా పోలీసులు చెబుతున్నారు.

సీపీ కార్యాలయ ఉద్యోగి మహేష్ పై  కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులను గోవా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ విషయమై విజయవాడ పోలీసులకు సమాచారం అందింది. గోవాకు విజయవాడ పోలీసులు బయలుదేరారు. గోవాకు వెళ్లాల్సిన విమానం మిస్ కావడంతో విజయవాడ పోలీసులు హైద్రాబాద్ ఎయిర్ పోర్టులో ఉన్నారు.

also read:బెజవాడలో మహేష్ హత్య కేసులో ట్విస్ట్: కారు రివర్స్ చేసి..

ఓ మహిళ విషయమై మహేష్ హత్య జరిగినట్టుగా పోలీసులు చెబుతున్నారు. సాత్విక్ రెడ్డి ఈ విషయంలో కీలకంగా వ్యవహరించినట్టుగా పోలీసులు తెలిపారు.

ఈనెల 10వ తేదీ రాత్రి విజయవాడలో  కాల్పులు జరగడంతో  మహేష్ మరణించాడు. మహేష్ ను హత్య చేసిన తర్వాత ఇద్దరు నిందితులు గోవాకు పారిపోయారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios