మచిలీపట్నంలో సిలిండర్ పేలుడు.. ఒకరు సజీవదహనం
కృష్ణాజిల్లా ప్రధాన కేంద్రం మచిలీపట్నంలో దారుణం జరిగింది. సిలిండర్ పేలుడు ఘటనలోఒక వ్యక్తి సజీవదహనమయ్యారు. తెల్లవారుజామున కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా గ్యాస్ సిలిండర్ పేలిపోయింది.
కృష్ణాజిల్లా ప్రధాన కేంద్రం మచిలీపట్నంలో దారుణం జరిగింది. సిలిండర్ పేలుడు ఘటనలోఒక వ్యక్తి సజీవదహనమయ్యారు. తెల్లవారుజామున కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా గ్యాస్ సిలిండర్ పేలిపోయింది.
పేలుడు ధాటికి ఇళ్లు కుప్పకూలిపోయగా.. సమీపంలోని నివాసాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మహ్మద్ బాజీ అనే వ్యక్తి అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. అందరూ గాఢనిద్రలో ఉండగా పెద్ద శబ్ధం రావడంతో జనం ఉలిక్కిపడి లేచారు. సమాచారం అందుకున్న పోలీసులు మంటలను అదుపుచేశారు.