కృష్ణానదిలో నలుగురు విద్యార్థుల గల్లంతు
గుంటూరు జిల్లా అమరావతికి సమీపంలోని గుండమెడ క్వారీ వద్ద కృష్ణా నదిలో నలుగురు విద్యార్థులు బుధవారం నాడు ఉదయం గల్లంతయ్యారు.
అమరావతి: గుంటూరు జిల్లా అమరావతికి సమీపంలోని గుండమెడ క్వారీ వద్ద కృష్ణా నదిలో నలుగురు విద్యార్థులు బుధవారం నాడు ఉదయం గల్లంతయ్యారు.
గుండిమెడ క్వారీ వద్ద కృష్ణా నదిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. దీంతో ఈ వరదలో విద్యార్థులు కొట్టుకుపోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానికులు, అధికారులు వరదలో కొట్టుకుపోయిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కృష్ణానదిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. వరద ప్రవాహన్ని తక్కువ అంచనా వేయడంతో విద్యార్థులు గల్లంతయ్యారని అనుమానిస్తున్నారు.