Asianet News TeluguAsianet News Telugu

తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు: ఐదుగురు మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  తిరుపతి,  ప్రకాశం  జిల్లాల్లో  జరిగిన  రెండు వేర్వేరు ప్రామాదాల్లో  ఐదుగురు మృతి చెందారు.  
 

Five  Killed  in Two Road Accidents in  Andhra pradesh
Author
First Published Mar 12, 2023, 11:06 AM IST

తిరుపతి:  రాష్ట్రంలోని  తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో  జరిగిన  వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు.  ఈ ప్రమాదాల్లో  ఒకరు గాయపడ్డారు.  గాయపడిన వారిని  ఆసుపత్రిలో  చేర్పించారు. 

తిరుపతి  జిల్లాలోని ధర్మపురం వద్ద  ఆదివారం నాడు జరిగిన  రోడ్డు ప్రమాదంతో  ముగ్గురు మృతి చెందారు..ఆయిల్  ట్యాంకర్, కారు ఢీకొనడంతో  ఈ ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో  ముగ్గురు  మృతి చెందారు. చెన్నై నుండి తిరుపతికి  కారులో  వస్తున్న సమయంలో  ఈ ప్రమాదం  జరిగింది.  

మరో వైపు  ప్రకాశం  జిల్లా కనిగిరి వద్ద  జరిగిన  రోడ్డు ప్రమాదంలో  ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో  ఓ మహిళా కూడా  తీవ్రంగా గాయపడ్డారు. కనిగిరి వద్ద అతివేగంగా  వెళ్తున్న కారు డివైడర్ ను ఢీకొని పల్టీ కొట్టింది.  ఈ ప్రమాదంలో కారులో ప్రయాణీస్తున్న ఇద్దరు  అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో  మహిళ గాయపడ్డారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios