కాకినాడలో అగ్నిప్రమాదం.. 40 బోట్లు దగ్ధం, భారీగా ఆస్తి నష్టం
కాకినాడలో బోట్ల తయారీ కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంలో 40 బోట్లు దగ్ధమయ్యాయి. దీంతో భారీ ఆస్తి నష్టం సంభవించింది.
![fire accident in boat manufacturing unit in kakinada ksp fire accident in boat manufacturing unit in kakinada ksp](https://static-ai.asianetnews.com/images/01ge1ea8jn7eje8pf4v825eeeh/fire_363x203xt.jpg)
కాకినాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బోట్ల తయారీ కార్మాగారంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 40 బోట్లు దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. 40 బోట్లు దగ్థమవ్వడంతో భారీగా ఆస్తినష్టం సంభవించింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.