Asianet News TeluguAsianet News Telugu

విజయవాడ అగ్ని ప్రమాద మృతులకు 50 లక్షల పరిహారం: జగన్

ఈ అగ్రిప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. 

Fire Accident At Vijayawada COVID Care Centre: CM YS Jagan Announces 50 Lakh Ex Gratia For The Deceased
Author
Vijayawada, First Published Aug 9, 2020, 9:32 AM IST

ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్ గా నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలస్ హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగి చికిత్స పొందుతున్న రోగులు, సిబ్బంది సహా ఇప్పటివరకు 9  మరణించారు. 

ఈ అగ్రిప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. 

క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం ఇదివరకే ఆదేశాలు ఇచ్చారు. ఓ ప్రైవేటు ఆస్పత్రి లీజుకు తీసుకున్న హోటల్లో కోవిడ్‌ పేషెంట్లను ఉంచగా, అందులో అగ్నిప్రమాదం సంభవించి పలువురు మరణించిన ఘటనపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios