భీమిలి పట్టణంలోని ఎగువ పేటలోని ఓ పెంకుటింట్లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
విశాఖపట్నం: షాట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదం ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. దాదాపు పది లక్షలకు పైగా ఆస్తినష్టం జరగడమే కాకుండా బాధిత కుటుంబానినికి నిలువ నీడ లేకుండా పోయింది. ఈ దుర్ఘటన విశాఖ జిల్లా భీమిలిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. భీమిలి పట్టణంలోని ఎగువ పేటలోని ఓ పెంకుటింట్లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగాయి. అవి అంతకంతకు వ్యాపించి ఇళ్లు మొత్తాన్ని కాల్చి బూడిద చేశాయి.
ఈ అగ్నిప్రమాదం ఎలాంటి ప్రాణనష్టాన్ని కలిగించకున్నా భారీ ఆస్తి నష్టాన్ని కలిగించింది. ఈ అగ్నిప్రమాదంలో సుమారు పదిలక్షల ఆస్తి నష్టం జరిగినట్లు....నగదు, నగలు, సామాన్లు కాలి బూడిదైనట్లు బాధిత కుటుంబం తెలిపింది. ఈ అగ్నిప్రమాదం కారణంగా కుటుంబం కట్టు బట్టలతో మిగిలింది.
వీడియో
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 22, 2020, 11:53 AM IST