Asianet News TeluguAsianet News Telugu

టీచర్ ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో అవకతవకలు: ఏపీ హైకోర్టులో యూటీఎఫ్ పిటిషన్


నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ  ఓటరు జాబితాలో అవకతవకలు చోటు చేసుకున్నాయని  ఏపీ హైకోర్టులో  ఏపీ యూటీఎఫ్  ఇవాళ పిటిషన్ దాఖలు చేసింది.  ఈ పిటిషన్  పై  ఏపీ హైకోర్టు రేపు విచారణ చేయనుంది. 

Fake voters:AP UTF  Files  petition  in AP High court
Author
First Published Dec 26, 2022, 3:58 PM IST

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల  ఎమ్మెల్సీ ఉపాధ్యాయ  ఓటరు జాబితాలో  అవకతవకలు చోటు  చేసుకున్నాయని  యూటీఎఫ్ ఆరోపించింది.  ఉపాధ్యాయుల ఓటరు జాబితాలో  చేర్చిన  అనర్హులను తొలటించాలని  యూటీఎఫ్  ఏపీ హైకోర్టులో  సోమవారం నాడు పిటిషన్ దాఖలు చేసింది.  .  ఈ పిటిషన్ పై   విచారణను రేపటికి  వాయిదా వేసింది  ఏపీ హైకోర్టు.

వచ్చే  ఏడాది మార్చి  29న  రాష్ట్రంలో  ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి.ఉపాధ్యాయ , గ్రాడ్యుయేట్స్  ఎమ్మెల్సీ స్థానాల నుండి  ప్రాతినిథ్యం వహిస్తున్న ఐదుగురు  సభ్యులు  2023 మార్చిలో  రిటైర్ కానున్నారు. దీంతో  ఈ ఐదు స్థానాల్లో  ఓటర్ల నమోదు ప్రక్రియను  ఎన్నికల సంఘం  ప్రారంభించింది. ఈ ఏడాది  నవంబర్  7వ తేదీ నుండి  ఓటర్ల  నమోదు ప్రక్రియ ప్రారంభమైంది.  అర్హులైన ఓటర్లు  తమ ఓటు హక్కును నమోదు చేసుకొనే వెసులుబాటును  ఈసీ  కల్పించింది.  అయితే  ఈ ప్రక్రియలో భాగంగా  ఉపాధ్యాయ  ఎమ్మెల్సీకి చెందిన ఓటరు జాబితాలో  అవకతవకలు చోటు చేసుకున్నాయని  యూటీఎప్ ఆరోపించింది.  ఈ విషయమై ఏపీ హైకోర్టులో  పిటిషన్ దాఖలు చేసింది.  అనర్హులను  ఓటరు  జాబితాలో  చేర్చినట్టుగా  యూటీఎఫ్ నేతలు  ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.  ప్రకాశంలో  50, చిత్తూరులో  30, నెల్లూరులో  50 శాతం  జాబితాలో  మార్పులు చేశారని యూటీఎప్ ఆ పిటిషన్ లో  ఆరోపించింది. ఉపాధ్యాయ ఓటరు జాబితాలో  అనర్హుల పేర్లను తొలగించాలని ఆ పిటిషన్  లో  యూటీఎఫ్ నేతలు  కోరారు.ఈ పిటిషన్ పై  ఏపీ హైకోర్టు రేపు విచారణను నిర్వహించనుంది. 

 శ్రీకాకుళం -విజయనగరం -విశాఖ పట్టభద్రుల నియోజకవర్గం నుండి  ప్రాతినిథ్యం వహిస్తున్న మాధవ్ పదవీ కాలం వచ్చే ఏడాది మార్చిలో  ముగియనుంది.  ప్రకాశం - నెల్లూరు- చిత్తూరు  ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న కత్తి నరసింహరెడ్డి  కూడా  వచ్చే ఏడాదిలో  రిటైర్ కానున్నారు.

 ప్రకాశం - నెల్లూరు- చిత్తూరు  జిల్లాల గ్రాడ్యుయేట్స్  ఎమ్మెల్సీ స్థానం నుండి  ప్రాతినిథ్యం వహిస్తున్న  వై. శ్రీనివాసులు రెడ్డి  పదవీకాలం కూడా ముగియనుంది. కడప  -అనంతపురం  -కర్నూల్  గ్రాడ్యుయేట్స్  స్థానం నుండి  ప్రాతినిథ్యం వహిస్తున్న వై. గోపాల్ రెడ్డి  కూడా రిటైర్ కానున్నారు.ప్రకాశం - నెల్లూరు- చిత్తూరు  జిల్లాల ఉపాధ్యాయ  ఎమ్మెల్సీ స్థానం నుండి  ప్రాతినిథ్యం వహిస్తున్న విఠపు బాలసుబ్రమణ్యం పదవీకాలం వచ్చే ఏడాది ముగియనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios