కరోనా: మాజీ ఎంపీ సబ్బంహరి ఆరోగ్య పరిస్ధితి విషమం
సీనియర్ రాజకీయ వేత్త, మాజీ ఎంపీ సబ్బంహరి వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది.
దేశంలో కరోనా వైరస్ భారీగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. ఇప్పటికే సినీతారలు, క్రీడా ప్రముఖులు, రాజకీయ నాయకులు కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా సీనియర్ రాజకీయ వేత్త, మాజీ ఎంపీ సబ్బంహరి వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది.