తిత్లీ తుపాను బాధితులకు విద్యుత్ శాఖ ఊరట
తిత్లీ తుఫాన్తో అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లా ప్రజలకు విద్యుత్శాఖ ఊరట ఇచ్చింది.
తిత్లీ తుఫాన్తో అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లా ప్రజలకు విద్యుత్శాఖ ఊరట ఇచ్చింది. ఈ నెల చెల్లించాల్సిన కరెంటు ఛార్జీలు వచ్చే నెలలో చెల్లించవచ్చని పేర్కొంది. ఎలాంటి అపరాధ రుసుం వసూలు చేయరని చెప్పింది. తిత్లీ తుపానుతో కష్టాల్లో ఉన్న ప్రజలపై భారం వేయవద్దని ఈపీడీసీఎల్కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.