Asianet News TeluguAsianet News Telugu

చేతబడి అనుమానం.. అర్థరాత్రి కత్తులు, గొడ్డళ్ళతో దాడి చేసి.. దంపతుల దారుణహత్య..

అర్థరాత్రి దంపతుల ఇంటికి వచ్చిన దుండగులు వారిని బైటికి పిలిచి.. కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు.

couple brutally murdered over suspicion of sorcery in alluri sitaramaraju district
Author
First Published Jan 17, 2023, 6:51 AM IST

అల్లూరి సీతారామరాజు జిల్లా :  సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఓ దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. సంతోషంగా ఇంట్లో పండుగ చేసుకుంటున్న వారిని బయటికి పిలిచి మరీ కత్తులు, గొడ్డలితో దాడి చేశారు. ఈ సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు కారణం భూతగాదాలు కానీ, చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో కానీ అయి ఉండవచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతులు మిడియం లక్ష్మయ్య(56), సింగమ్మ (52)లుగా గుర్తించారు.  

ఈ దంపతులిద్దరూ ఊర్లో వ్యవసాయం చేస్తుంటారు. గ్రామంలో కొందరితో వీరికి భూగతాదాలు కూడా ఉన్నాయి. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత వీరింటికి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. లక్ష్మయ్యను బయటికి పిలిచారు. లక్ష్మయ్య ఇంటి బయటకు వచ్చి వారితో మాట్లాడి.. తిరిగి లోపలికి వెళుతుండగా అతని తల మీద గొడ్డలితో వేటు వేశారు. తర్వాత కర్రలతో గట్టిగా కొట్టారు. దీంతో లక్ష్మయ్య తీవ్ర గాయాలతో అక్కడికక్కడే పడిపోయాడు. అర్ధరాత్రి ఇంటికి మనుషులు రావడం.. భర్తను బయటికి పిలవడంతో మేల్కొన్న సింగమ్మ.. భర్త మీద దాడిని చూసి కాపాడేందుకు బయటకు వచ్చింది..  నిందితులకు అడ్డుపడింది.. దీంతో వారు ఆమె తలపై కూడా బలంగా కొట్టారు.  ఆమె కూడా అక్కడే కుప్పకూలిపోయింది.

నెల్లూరు జిల్లాలో విషాదం: శ్రీహరికోటలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు జవాన్ల ఆత్మహత్య

ఆ తర్వాత దుండగులు భార్యాభర్తలు ఇద్దరిపై అతి క్రూరంగా దాడి చేశారు. ముఖం, తలా, ఒంటిపై విచక్షణారహితంగా కొట్టి చంపేశారు. అయితే ఈ సంఘటన జరిగిన సమయంలో వారింట్లో మరొకరు కూడా ఉన్నారని తెలుస్తోంది. శాంతి అనే వారి కోడలు ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. దాడి జరిగిన తర్వాత తెల్లవారాక ఈ విషయాన్ని పోలీసులకు, గ్రామస్తులకు ఆమె తెలిపింది. ఈ దాడి వెనుక కారణాల అన్వేషణలో భాగంగా ఈ దంపతులకు గ్రామంలో కొందరితో భూతగాదాలు ఉన్నాయని తెలిసింది.  లక్ష్మయ్య చేతబడులు కూడా చేస్తారని గ్రామంలో కొంతమంది నమ్ముతారని సమాచారం. 

ఇదిలా ఉండగా, గుంటూరు జిల్లా పొన్నూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య పరిస్థితులు ఓ కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకునేలా చేశాయి. ఈ విషాద ఘటన సోమవారం గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కసుకర్రు గ్రామంలో వెలుగుచూసింది. దీనికి సంబంధించి స్థానికులు ఈ మేరకు వివరాలు తెలిపారు.. తుమ్మంపాటి చిన్న సుబ్బయ్య(50), తుమ్మంపాటి రోజా (45)ఇదే గ్రామంలో ఉంటున్న భార్యభర్తలు. వీరు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. 

భార్యభర్తలిద్దరూ కొంతకాలంగా దీర్ఘకాలిక అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పలు రకాలుగా చికిత్స చేయించుకుంటున్నారు. అయినా వారికి నయం కావడం లేదు. దీనికి తోడు వైద్య ఖర్చులతో ఆర్థి ఇబ్బందులు ఏర్పడ్డాయి. రెండు రకాల సమస్యతో వారు తీవ్రంగా కృంగిపోయారు. ఎలాగైనా దీన్నుండి బయటపడాలనుకున్న చిన్న సుబ్బయ్య... భార్య రోజా తలమీద కర్రతో కొట్టి చంపేశాడు. ఆ తరువాత తాను కూడా అదే గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఇరుగుపొరుగుతో కలివిడిగా ఉండే ఈ దంపతులు తెల్లారినా బయటికి రాకపోవడం.. అలికిడి లేకపోవడంతో స్థానికులు అనుమానించాడు. ఇంట్లోకి వెళ్లి చూశాడు. అక్కడ ఇద్దరూ చనిపోయి కనిపించారు. దీంతో వెంటనే పొన్నూరు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios