ఏపీలో కరోనా విజృంభణ: కొత్తగా 23 కేసులు, 14కు చేరిన మృతులు
ఇప్పటి వరకు 20 మంది డిశ్చార్జీ అయ్యారు. 14 మంది మరణించారు. దీంతో ప్రస్తుతం ఆస్పత్రుల్లో 491 మంది చికిత్స పొందుతున్నారు. గుంటూరు జిల్లా 122 కేసులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కర్నూలులో 110 కేసులు నమోదయ్యాయి. దీంతో అత్యధిక కేసుల నమోదైన జిల్లాల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కరోనా కేసులు ఏవీ నమోదు కాలేదు.
జిల్లాలవారీగా కరోనా వైరస్ కేసుల సంఖ్య ఇలా ఉంది...
అనంతపురం 21
చిత్తూరు 23
తూర్పు గోదావరి 17
గుంటూరు 122
కడప 36
కృష్ణా 45
కర్నూలు 110
నెల్లూరు 58
ప్రకాశం 42
విశాఖపట్నం 20