Asianet News TeluguAsianet News Telugu

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ పై తప్పుడు ప్రచారం: ప్రజలను హెచ్చరించిన ఏపీ

హైడ్రాక్సీ క్లోరోక్విన్ పై వచ్చిన వార్తాకథనాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టత ఇచ్చింది. కరోనావైరస్ సోకకుండా హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడితే ప్రమాదం వాటిల్లుతుందని హెచ్చరించింది.

Coronavirus: AP health department clarifies on Hydroxychloroquine
Author
Amaravathi, First Published Mar 24, 2020, 9:59 AM IST

అమరావతి:  హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను వినియోగిస్తే కరోనా రాదనే భావన కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయని, ఇది వాస్తవం కాదని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. 

- సాధారణ వ్యక్తులెవ్వరూ కూడా ఈమందును వినియోగించకూడదు. దుష్పరిణామాలకు దారితీస్తుంది.

– కరోనా సోకిన వారికి మాత్రమే ఈమందును వాడాలని అఖిల భారత వైద్య పరిశోధన మండలి స్పష్టంచేసింది. ఇదికూడా ప్రత్యామ్నాయంలో భాగమే. 

– అంతేకాక కరోనా సోకిన రోగులకు, సేవలందిస్తున్న వైద్యులకు, సిబ్బందికి ముందు జాగ్రత్తగా మాత్రమే హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ వినియోగిస్తున్నారు. ఇది పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో దీన్ని పాటిస్తున్నారు.

– అందువల్ల కరోనా రాకుండా ఉండాలంటే. హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ వాడితే సరిపోతుందన్న భావనలోకి ప్రజలెవ్వరూ వెళ్లవద్దని విజ్ఞప్తిచేస్తున్నాం. సాధారణవ్యక్తులెవ్వరూ కూడా ఈ మందును వినియోగించవద్దని కోరుతున్నాం. 

– హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ను కేవలం నిపుణుల పర్యవేక్షణలో, వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఇస్తున్నారు. కోవిడ్‌ సోకినవారికి, వారితో ఉన్నందువల్ల వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నవారికి పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఇస్తున్న మందు మాత్రమే. మందు తీసుకున్న వారు పూర్తి వైద్య పర్యవేక్షణలో ఉంటున్నారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించ ప్రార్థన. 

Follow Us:
Download App:
  • android
  • ios