Asianet News TeluguAsianet News Telugu

తాడేపల్లిలోని గోశాలలో శాంతి యజ్ఞం.. పాల్గొన్న సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాంతి యజ్ఞంలో పాల్గొన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం వద్ద ఉన్న గోశాలలో ఈ శాంతి యజ్ఞం నిర్వహించారు.

cm jagan participated in shanti yagnam at goshala in tadepalli cm camp office ksm
Author
First Published Jun 4, 2023, 9:33 PM IST

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాంతి యజ్ఞంలో పాల్గొన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం వద్ద ఉన్న గోశాలలో ఈ శాంతి యజ్ఞం నిర్వహించారు. ఇటీవల విజయవాడలో ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిర్వహించిన అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం నిర్వహించిన సంగతి  తెలిసిందే. ఈ మహా యజ్ఞంలో సీఎం జగన్‌  పాల్గొన్నారు. 

cm jagan participated in shanti yagnam at goshala in tadepalli cm camp office ksm

అయితే మహాయజ్ఞం విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా వేద పండితుల సూచనల మేరకు, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు నిమిత్తం గోశాలలో శాంతి యజ్ఞం నిర్వహించారు. వేదపండితులు నిర్వహించిన ఈ శాంతి యజ్ఞంలో సీఎం జగన్‌తో పాటు దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాంతి యజ్ఞంలో పాల్గొన్న ముఖ్యమంత్రికి మంత్రి కొట్టు సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios