Asianet News TeluguAsianet News Telugu

విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టిన చింతలపూడి ఎమ్మెల్యే కారు: ఎలీజా సహా కుటుంబ సభ్యులు క్షేమం

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యేకు ప్రమాదం జరిగింది.  విద్యుత్ స్థంభాన్ని ఢీకొనడంతో  ఈ ప్రమాదం జరిగింది.  కారులో బెలూన్లు తెరుచుకోవడంతో ఎమ్మెల్యే సహా ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. 

Chintalapudi MLA eliza Safely Escapes From road accident
Author
First Published Dec 20, 2022, 9:29 AM IST

ఏలూరు:ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడి ఎమ్మెల్యేకు  ప్రమాదం తప్పింది.ఎమ్మెల్యే  ఎలీజా తన కుటుంబ సభ్యులతో  కారులో  వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.  అడమిల్లిలో  విద్యుత్ స్థంభాన్ని  కారు ఢీకొట్టింది. దీంతో కారు బెలూన్లు తెరుచుకున్నాయి.  బెలూన్లు తెరుచుకోవడంతో  ఎమ్మెల్యే సహా కారులో  ఉన్నవారంతా క్షేమంగా  ఉన్నారు. 

హైద్రాబాద్ నుండి జంగారెడ్డిగూడెం వస్తున్న సమయంలో  మంగళవారంనాడు తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.జిల్లాలోని కామవరపుకోట మండలం అడమిల్లి వద్ద  ఎమ్మెల్యే ప్రయాణీస్తున్న కారు అదుపుతప్పి  విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదం నుండి బయటపడిన  ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యులతో మరో కారులో జంగారెడ్డిగూడెనికి  చేరుకున్నారు.  ఈ ప్రమాదంలో  ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios