Asianet News TeluguAsianet News Telugu

సీఎం జ‌గ‌న్ ను అడ్డుతొల‌గించేందుకు చంద్ర‌బాబు కుట్ర - మంత్రి మేరుగ నాగార్జున

సీఎం జగన్ పై చంద్రబాబు నాయుడు కుట్రపన్నుతున్నారని మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు. మహానాడు సందర్భంగా, గతంలో పలు మార్లు చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయని తెలిపారు. 

Chandrababu conspiracy to thwart CM Jagan - Minister Meruga Nagarjuna
Author
Amaravati, First Published May 28, 2022, 9:29 AM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం జ‌గ‌న్ ను రాజ‌కీయంగా ఏం చేయలేక‌, ఆయ‌న‌ను అడ్డుతొల‌గించేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కుట్ర‌కు పాల్ప‌డుతున్నార‌ని మంత్రి మేరుగ నాగార్జున తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. శుక్ర‌వారం సామాజిక న్యాయ‌భేరి బ‌స్సు యాత్ర అనకాప‌ల్లికి చేర‌కుంది. ఈ సంద‌ర్భంగా పాయ‌క‌రావుపేట‌లో ఎమ్మెల్యే బాబూరావు స‌మ‌క్షంలో కార్య‌క‌ర్త‌లు ఆ బ‌స్సు యాత్ర‌కు వెల్ క‌మ్ చెప్పారు. ఈ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా అక్క‌డ స‌భ ఏర్పాటు చేశారు. ఈ స‌భ‌లో  మంత్రి నాగార్జున మాట్లాడారు. 

అనంతపురంలో విషాదం.. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురి మృతి...

సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో లేకుండా చేస్తాన‌ని మాజీ సీఎం మ‌హానాడులో ప్ర‌స్తావించార‌ని తెలిపారు. ఈ మాట‌లు ఎన్నో అనుమానాల‌ను పురిగొల్పుతున్నాయ‌ని అన్నారు. గ‌తంలో కూడా చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న కుమారుడు లోకేష్ లు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌ట్ల అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని అన్నారు. ఏపీలో సీఎం జ‌గ‌న్ ప్ర‌వేశ‌పెట్టిన మంచి ప‌థ‌కాలు చూసి ప్ర‌జ‌లంతా సంతోషంగా ఉన్నార‌ని చెప్పారు. అందుకే ఆయ‌న‌ను రెండో సారి సీఎం చేసేందుకు అంద‌రూ ఎదురుచూస్తున్నార‌ని తెలిపారు. 

టీడీపీలో రామారావులు లేరు.. అంతా కామారావులే, నా... రా... అంటే ఏమిటంటే : మహానాడుపై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో సీఎం జ‌గ‌న్ కు ఎంతో ఆద‌ర‌ణ పెరుగుతోంద‌ని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. దానిని చూడ‌లేక‌నే ఓర్వలేని త‌నంతో చంద్ర‌బాబు నాయుడు జ‌గ‌న్ పై కుట్ర‌ల‌కు పాల్పడ‌తున్నాడ‌ని ఆరోపించారు. ప‌లు సందర్భాల్లో సీఎం జ‌గ‌న్ విష‌యంలో మాజీ సీఎం మాట‌లు ఎంతో ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయ‌ని అన్నారు. వీటి పట్ల వైఎస్సార్ ఫ్యాన్స్ తీవ్ర క‌ల‌త ప‌డుతున్నార‌ని చెప్పారు. సీఎంను అసలు రాష్ట్రంలోనే ఉంచ‌కుండా చేస్తామ‌ని మాజీ సీఎం చెప్ప‌డంతో ఎన్నో అనుమానాల‌ను క‌లుగ‌జేస్తుంద‌ని అన్నారు. 

NTR Jayanti: ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యుల నివాళి.. పురందేశ్వరి భావోద్వేగం

సీఎంను జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని కాపాడుకునేందుకు ప్ర‌తీ వైసీపీ కార్య‌క‌ర్త సోల్జ‌ర్ లాగా రెడీగా ఉండాల‌ని సూచించారు. ఎవ‌రు ఎన్ని ప్ర‌యత్నాలు చేసినా సీఎంను ఏం చేయ‌లేరని ధీమా వ్య‌క్తం చేశారు. పార్టీ కార్య‌క‌ర్త‌లు, వైస్సాఆర్ అభిమానులు క‌లిసిక‌ట్టుగాఉండి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి స‌పోర్ట్ గా ఉండాల‌ని అన్నారు.సీఎం జ‌గ‌న్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్ర‌జ‌లకు ఫ్రీగా డ‌బ్బులు పంచి పెడుతున్నార‌ని మాజీ సీఎం ఆరోప‌ణ‌లు చేయ‌డం ఎంతో శోఛ‌నీయమ‌ని అన్నారు. ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ఎన్నో మంచి కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాలు అమ‌లు చేస్తుంటే చంద్ర‌బాబు నాయుడు చౌక‌బారు విమ‌ర్శ‌ల‌కు పూనుకుంటున్నార‌ని తీవ్రంగా దుయ్య‌బ‌ట్టారు. ఏపీలో ఎన్ని పార్టీలో బ‌రిలో ఉన్నా, క‌లిసి పోటీ చేసినా మ‌ళ్లీ జ‌గ‌న్ స‌ర్కారే కొలువు దీరుతుంద‌ని అన్నారు. వైసీపీ మ‌రో సారి అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios