బిగ్ బ్రేకింగ్.. విజయవాడ దుర్గగుడి ఛైర్మన్ పై హత్యయత్నం..ఆస్పత్రికి తరలింపు
Durga Temple Vijayawada: దుర్గగుడి చైర్మన్ పై హత్యాయత్నం జరిగింది. గాజు సీసాతో కర్నాటి రాంబాబుపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశాడు. కడుపులో గాయాలు కావడంతో అతడ్ని ఆసుపత్రి కి తరలించారు.
Durga Temple Vijayawada: దుర్గగుడి ఛైర్మన్ కర్నాటి రాంబాబుపై గుర్తు తెలియని వ్యక్తి హత్యయత్నం చేశాడు. దీంతో గాజు సీసాతో దాడి చేయడంతో రాంబాబు తీవ్రంగా గాయాలయ్యాడు. ప్రైవేటు ఆస్పత్రిలో రాంబాబు చికిత్స పొందుతున్నారు. రాంబాబుకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ దాడి చేసిన వ్యక్తిని రాంబాబు అనుచరులు దొరకబడి చితకబాదారు. అనుచరులు దాడిలో కృష్ణకు తీవ్ర గాయాలు కావడంతో అతడ్ని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
ఇటీవలే దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు తండ్రి మరణించారు. ఈ క్రమంలో స్మశానంలోని తండ్రి సమాధి వద్ద దీపం పెట్టడానికి వెళ్లిన రాంబాబుపై దాడి జరిగింది. గుర్తితెలియని వ్యక్తి వెనుక నుండి వచ్చి సీసాతో దాడి చేశాడు. ఈ దాడిని పసిగట్టి పెను ప్రమాదం తప్పింది. దాడికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియల్సి ఉంది.