ఈ నెల 6న ఏపీ ప్రభుత్వంతో కేంద్రం భేటీ.. 7 శాఖలపై సమీక్ష
ఈ నెల 6న ఏపీ ప్రభుత్వంతో కీలక భేటీ నిర్వహించనుంది కేంద్ర ప్రభుత్వం. ఏపీకి సంబంధించిన వివిధ కీలక అంశాలపై కేంద్ర సమన్వయ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఏడు శాఖలకు సంబంధించిన ముఖ్యమైన 13 అంశాలపై ఆయా శాఖల కేంద్ర కార్యదర్శులు .. ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ , ఆయా శాఖ ఏపీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు
ఈ నెల 6న ఏపీ ప్రభుత్వంతో కీలక భేటీ నిర్వహించనుంది కేంద్ర ప్రభుత్వం. ఏపీకి సంబంధించిన వివిధ కీలక అంశాలపై కేంద్ర సమన్వయ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఏడు శాఖలకు సంబంధించిన ముఖ్యమైన 13 అంశాలపై ఆయా శాఖల కేంద్ర కార్యదర్శులు .. ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ , ఆయా శాఖ ఏపీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పోలవరం ప్రాజెక్ట్తో పాటు కడప స్టీల్ ప్లాంట్, కృష్ణా-గోదావరి రివర్ బోర్డ్ గెజిట్, పెట్రో కెమికల్ కాంప్లెక్స్లతో పాటు వైజాగ్ - చెన్నై పారిశ్రామిక కారిడార్లపై కేంద్రం చర్చించనుంది.