Asianet News TeluguAsianet News Telugu

ఎంపీ రఘురామకృష్ణరాజు సహా 16 మందిపై సీబీఐ ఛార్జిషీట్...

సిబిఐ కథనం ప్రకారం.. 2018 అక్టోబర్ 3 న హైదరాబాద్ కు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీ, దాని  డైరెక్టర్ల పైన ఢిల్లీలోని ఈవోడబ్ల్యూ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సీబీఐ 2019 ఏప్రిల్ 29న ఆ సంస్థపై కేసు నమోదు చేసింది. విచారణలో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. 

CBI chargesheet against 16 including MP Raghuram Krishnaraju
Author
Hyderabad, First Published Jan 1, 2022, 8:03 AM IST

ఢిల్లీ :  కన్సార్షియం నుంచి రుణాలు తీసుకుని ఎగ వేసిన కేసులో వైకాపా ఎంపీ Raghuram Krishnarajuతో పాటు ఆయన కంపెనీ, అనుబంధ కంపెనీలు, గుత్తేదారులు, చార్టెడ్ అకౌంటెంట్ తో కలిసి 16 మందిపై Chargesheet దాఖలు చేసినట్లు సీబీఐ ఒక ప్రకటనలో తెలిపింది. డిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టుల సముదాయంలోని 
CBI casesప్రత్యేక న్యాయస్థానంలో స్పెషల్ జడ్జి ఎదుట ఛార్జీషీట్ దాఖలు చేసినట్లు వెల్లడించింది.

సిబిఐ కథనం ప్రకారం.. 2018 అక్టోబర్ 3 న హైదరాబాద్ కు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీ, దాని  డైరెక్టర్ల పైన ఢిల్లీలోని ఈవోడబ్ల్యూ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సీబీఐ 2019 ఏప్రిల్ 29న ఆ సంస్థపై కేసు నమోదు చేసింది. విచారణలో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఎంపీ రామకృష్ణంరాజు చైర్మన్ గా ఉన్న ఇండ్ భారత్ కంపెనీ తమిళనాడు ట్యుటికోరిన్ లో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థను నెలకొల్పుతామంటూ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎఫ్ సీ) ఆధ్వర్యంలో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఆర్ఈసీ), ఇండియా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్  (ఐఐఎఫ్ సీఎల్)తో కూడిన కన్సార్టియం నుంచి రూ. 947.71 కోట్ల రుణం తీసుకుంది. ఆ మొత్తంతో నిందితుడు ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి పంపిణీ పూర్తి చేయలేదు. 

ఒప్పందం నిబంధనలు పాటించలేదు. తాము తీసుకున్న రుణాలను నిందితులు, సదరు కంపెనీ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపంలో మళ్ళించడంతోపాటు గుత్తేదారులకు అడ్వాన్సుగా చెల్లించారు. పైగా తాము ఫిక్స్ డ్ చేసిన మొత్తం నుంచి రుణాలు తీసుకున్నారు. గ్రూప్ పరిధిలోని ఇతర కంపెనీల గుత్తేదారులకు అడ్వాన్సులు చెల్లించారు. తీసుకున్న రుణాలు చెల్లించక పోవడంతోపాటు ఫిక్స్ డ్ డిపాజిట్లను రుణ ఖాతాలకు సర్దుబాటు చేయడంతో  రుణాలు ఇచ్చిన కంపెనీలు నష్టపోయాయి.

ఏపీలో మారుతున్న కాపు రాజకీయం: పార్టీలకతీతంగా ఒక్కటవుతున్న నేతలు, శాసించేది తామేనన్న గంటా

థర్మల్ కంపెనీ ఏర్పాటు పేరుతో ఇండ్ భారత్ కంపెనీ, ఇతర నిందితులు తో కలిసి అక్రమంగా నిధులు వాడుకోవడంతో పాటు నిజాయితీగా వ్యవహరించకపోవడంతో కన్సార్షియం రూ.947.71 కోట్లు నష్టపోవడానికి కారణం అయింది.

psp పిటిషన్కు అనుమతించిన ఎన్ సీఎల్ టీ
ఎంపీ రఘురామ కృష్ణరాజు చెందిన ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ కంపెనీ దివాలా పరిష్కార ప్రక్రియకు అనుమతిస్తూ జాతీయ కంపెనీ లా ట్రెబ్యునల్ హైదరాబాద్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. ఇండ్ భారత్ కంపెనీ తీసుకున్న రుణం రూ.327.51 కోట్లు చెల్లించకపోవడంతో పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎన్ సీఎల్ టీలో పిటిషన్ వేసింది. దీనిపై జ్యుడీషియల్ సభ్యులు డాక్టర్ వెంకటరామకృష్ణ బి.ఎన్., సాంకేతిక సభ్యుడు ఎ.వీరబ్రహ్మారావులతో కూడిన ధర్మాసనం విచారించి తీర్పునిచ్చింది. బ్యాంకుల కన్సార్షియం రూ 1383.38 కోట్ల వసూలు కోసం ఢిల్లీ  రుణ వసూళ్ల ట్రెబ్యునల్ పిటిషన్ వేశాయి. వీటికి గానూ ఇండ్ భారత్ కంపెనీ రూ. 872.63 కోట్లను మాత్రమే హామీనిచ్చింది. 

nclt లో దరఖాస్తు చేయడానికి ముందు నోటీసు జారీ చేయలేదని, అంతేకాకుండా రుణదాతల కన్సార్షియం ఉండగా, వ్యక్తిగతంగా ఒక రుణదాత పిటిషన్ వేయడానికి వీల్లేదన్న ఇండ్ భారత్ వాదనను తోసిపుచ్చింది. అన్ని అంశాలను పరిశీలించాక ఇండ్ భారత్ వాదనను తోసిపుచ్చింది. అన్ని అంశాలను పరిశీలించాక ఇండ్ భారత్ థర్మల్ దివాలా ప్రక్రియ చేపట్టడానికి అనుమతించింది. దివాలా పరిష్కార నిపుణుడిగా శ్రీకాకుళం వంశీకృష్ణను నియమించింది. ఇండ్ భారత్ ఆస్తుల క్రయవిక్రయాలపై నిషేధం విధించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios