విశాఖపట్నంలో మంగళవారం అర్ధరాత్రి ఓ మహిళా వైద్యురాలు మద్యంమత్తులో కారునడిపి నానా బీభత్సం సృష్టించింది.
విశాఖపట్నం : మద్యం మత్తులో కారు నడిపి ఓ వైద్యురాలు విశాఖపట్నంలో బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి రోడ్డుపక్కన పార్క్ చేసిన వాహనాలపైకి దూసుకెళ్ళిన కారు డివైడర్ పైకి ఎక్కి ఆగింది. ఈ సమయంలో వాహనాల వద్ద ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.
స్థానికుల కథనం ప్రకారం... మంగళవారం అర్థరాత్రి విశాఖపట్నంలోని రామాటాకీస్ వైపునుండి సిరిపురం వైపు మితిమీరిన వేగంతో దూసుకెళుతున్న ఓ కారు అదుపుతప్పింది. విఐపి రోడ్డులోని ప్యారడైజ్ హోటల్ సమీపంలో నిలిపిన ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లిన కారు డివైడర్ ను ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా పుట్ ఫాత్ పైకి ఎక్కిన కారు చెట్టును ఢీకొని ఆగింది. ఈ ప్రమాదంలో ఏడు ద్విచక్ర వాహనాలతో పాటు కారు ధ్వంసమయ్యింది.
వీడియో
నగరానికి చెందిన ఓ వైద్యురాలు మద్యం మత్తులో చేసిన ర్యాష్ డ్రైవింగే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత మరో కారులో డాక్టర్ పరారయినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంపై సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
