నెల్లూరులో కారు భీభత్సం... ఆరుగురికి తీవ్ర గాయాలు
నెల్లూరు పట్టణంలో ఓ కారు నడిరోడ్డుపై భీభత్సం సృష్టించింది. మధ్యం సేవించి కారు డ్రైవ్ చేసిన ఓ వ్యక్తి పట్టణంలోని ట్రంక్ రోడ్డుపై భారీ ప్రమాదానికి కారణమయ్యాడు. కారు అదుపుతప్పి రోడ్డుపై వెళుతున్న పాదచారులపైకి దూసుకెళ్లడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
నెల్లూరు పట్టణంలో ఓ కారు నడిరోడ్డుపై భీభత్సం సృష్టించింది. మధ్యం సేవించి కారు డ్రైవ్ చేసిన ఓ వ్యక్తి పట్టణంలోని ట్రంక్ రోడ్డుపై భారీ ప్రమాదానికి కారణమయ్యాడు. కారు అదుపుతప్పి రోడ్డుపై వెళుతున్న పాదచారులపైకి దూసుకెళ్లడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
పాదచారులను ఢీ కొట్టిన తర్వాత కూడా ఆగకుండా దూసుకెళ్ళిన కారు ఓ ఆటోను కూడా ఢీకొట్టింది. అయితే కొందరు స్థానికులు కారు డ్రైవర్ ను పట్టుకోడానికి ప్రయత్నించగా అతడు పరారైనట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో ఆరుగురు పాదచారులు తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు స్వల్పంగా గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారందరు ప్రస్తుతం స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన కారు అగర్వాల్ ఐ ఆస్పత్రి డాక్టర్ శివ ప్రతాప్ రెడ్డి కి చెందినదిగా గుర్తించారు. అయితే ప్రమాద సమయంలో కారును నడిపింది ఎవరని తెలుసుకోడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.