పది సెంట్ల భూమికోసం దాయాదులు దారుణానికి తెగబడ్డారు. ఓ వ్యక్తిని అతి దారుణంగా హత్య చేశారు. వాటాల పంపిణీలో వచ్చిన వివాదం చివరికి హత్యకు దారి తీసింది. 

అనంతపురం : కేవలం 10 సెంట్ల స్థలం కోసం దాయాదులే దారుణంగా చంపేశారు. తలుపులు మండలం బట్రేపల్లి పంచాయతీ పరిధి మూలపల్లికి చెందిన రామ్మోహన (45)ను దాయాదులే బుధవారం హత్యచేశారు. రూరల్ సీఐ శంకర్ నాయక్ తెలిపిన వివరాల మేరకు.. రామ్మోహన తండ్రికి ఏడుగురు అన్నదమ్ములు, ఉన్న 14 ఎకరాల ఆస్తిని రెండెకరాల చొప్పున పంచుకున్నారు. రామ్మోహన ఒక్కడే కుమారుడు. ఇతడి భాగానికి 1.90 ఎకరాల భూమి ఉంది. అతడి దాయాదులు, అన్నాదమ్ములైనా రామాంజనేయులు, లక్ష్మణ్ కు 1.90 ఎకరాల భూమి వచ్చింది. వీరి పొలాలు పక్కపక్కనే ఉన్నాయి. 

వాటాల పంపిణీలో రెండుకరాలు రావాల్సిన చోట ఇద్దరికీ పది సెంట్ల చొప్పున తక్కువగా వచ్చింది. ఈ విషయమై వారి మధ్య కొన్నేళ్లుగా వివాదం ఉంది. గ్రామంలోని పెద్ద మనుషులు ఇద్దరికీ సర్దిచెప్పినా సమస్య పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం రామ్మోహనతో రామాంజనేయులు, లక్ష్మణ్ పొలం వద్ద తగాదా పడ్డారు. రామ్మోహనపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సీఐ వివరించారు. మృతుడి భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. రామ్మోహనకు ఇద్దరు పిల్లలున్నారు. శవాన్ని పోస్టుమార్టంకి తరలించారు. 

"ఇది చాలా ఘోరమైన నేరం. దీనిమీద క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తాం" అని కొత్వాల్ అన్నారు. శత్రుత్వమే హత్యకు ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా, జమ్మూ కాశ్మీర్‌లోని ఖథువా జిల్లాలో 10 ఏళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ మేరకు పోలీసులు బుధవారం సమాచారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు మైనర్లు సహా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వారు తెలిపారు. మృతుడు ప్రణయ్ కుమార్ సైద్‌పూర్ గ్రామంవాసి. మంగళవారం ట్యూషన్ కు వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు ఊరంతా వెతికారు. 

దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కూడా గాలింపు చేపట్టారు. వీరి గాలింపులో అర్ధరాత్రి దాటిన తర్వాత గ్రామ శివార్లలోని పొదల్లో ఓ గోనె సంచి కనిపించింది. అనుమానంతో దాన్ని పరిశీలించగా.. అందులో కనిపించకుండా పోయిన చిన్నారి విగతజీవిగా కనిపించాడు. బాలుడిని చంపేసి, శవాన్ని గొనెసంచిలో కుక్కి అక్కడ పారేశారని పోలీసు అధికారి తెలిపారు. బాలుడి నోటికి టేప్ అతికించి ఉంది.. మర్మాంగాలు కట్టివేసి ఉన్నాయి. బాలుడిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. 

బాలుడిని అతి దారుణంగా హత్య చేసినట్లు కథువా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్‌సి కొత్వాల్ తెలిపారు. హత్య సమయంలో బాలుడు తప్పించుకునేందుకు తీవ్రంగా వ్యతిరేకించి ఉంటాడన్నారు. అతని శరీరం మీదున్న గాయాల గుర్తులు పెనుగులాటను తెలుపుతున్నాయన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించామని, రిపోర్ట్ వచ్చిన తరువాత గానీ.. మరణానికి ఖచ్చితమైన కారణం తెలియదని అధికారి తెలిపారు."ఇది చాలా ఘోరమైన నేరం. దీనిమీద క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తాం" అని కొత్వాల్ అన్నారు. శత్రుత్వమే హత్యకు ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు.