నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్‌లో పడవ బోల్తా  పడింది. ఈ ఘటనలో పలువురు గల్లంతయ్యారు. 

నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్‌లో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు గల్లంతయ్యారు. ఒకరు మృతిచెందగా.. మరోకరి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుంది. వివరాలు.. 12 మంది పర్యాటకులతో వెళ్తున్న పడవ అలల తాడికి బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది గల్లంతయ్యారు. అయితే 10 మంది ప్రాణాలతో బయటపడగా.. ఒకరు మృతిచెందారు. కాగా.. మరొకరి కోసం గజ ఈతగాళ్ల సాయంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే పర్యాటకులు లైఫ్ జాకెట్లు వేసుకోవడం వల్ల పెను ప్రమాదం తప్పినట్టుగా తెలుస్తోంది. ఇక, పడవలోని పర్యాటకులంతా తంజావురు వాసులుగా తెలుస్తోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred