కేంద్ర ప్రభుత్వ పథకం 'స్వామిత్వ' పేరుమార్చి తన పథకంగా సీఎం జగన్ ప్రచారం చేసుకుంటున్నారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు.
గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పుట్టినరోజున(సోమవారం) 'వైయస్సార్ జగనన్న భూహక్కు-భూ రక్ష' పేరిట భూముల రీసర్వేను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వ పథకం 'స్వామిత్వ' పేరుమార్చి తన పథకంగా సీఎం జగన్ ప్రచారం చేసుకుంటున్నారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి
ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికన సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు.
''పుట్టినరోజే అబద్దాలా? ప్రజల స్థలాల రక్షణ, భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం పథకం’స్వామిత్వ’ప్రవేశపెడితే వైఎస్ జగన్ గారు మీ ప్రభుత్వం పేరుమార్చి ‘వైయస్సార్ జగనన్న భూహక్కు-భూ రక్ష ‘ప్రారంభోత్సవం చేయడం ఏంటి?పేర్లు మార్చి ప్రజలను ఎన్నాళ్ళు ఏమార్చగలరు. కనీసం ప్రధాని పోటో పెట్టరా?'' అంటూ ట్విట్టర్ వేదికన ప్రశ్నించారు.
''సీఎం జగన్ గారు కాంగ్రెస్ పార్టీని వీడినా ఆ పార్టీ సాంప్రదాయాన్ని మాత్రం విడిచినట్లు లేరు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను తన సొంత పేరు పెట్టుకుని ప్రచారం చేసుకోవడాన్ని ఖండిస్తున్నా. ఈ విషయంలో ప్రధాని మోదీని చూసి జగన్ చాలా నేర్చుకోవాలి. గత ఆరేళ్లుగా కేంద్ర ప్రభుత్వం వేల సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు చేపట్టిన ఏ ఒక్కదానికి ప్రధాని తన పేరు పెట్టుకోలేదు'' అని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
CM @ysjagan garu left congress party but didn’t leave the congressi culture. Naming govt’s schemes/plans after his own name is condemnable.
— S. Vishnu Vardhan Reddy (@SVishnuReddy) December 22, 2020
He must learn from PM @narendramodi ji who started thousands of welfare schemes in past 6 years but didn’t name any single one after himself pic.twitter.com/nRF8YMBq4Y
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 22, 2020, 12:29 PM IST