వైఎస్ఆర్సీపీకి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి
లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని వైఎస్ఆర్సీపీకి ఇవ్వాలని బీజేపీ యోచిస్తున్నట్టుగా సమాచారం. అయితే ఈ విషయమై వైఎస్ఆర్సీపీ తన అభిప్రాయాన్ని బీజేపీకి చెప్పాల్సి ఉంది.
అమరావతి: లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని వైఎస్ఆర్సీపీకి ఇవ్వాలని బీజేపీ యోచిస్తున్నట్టుగా సమాచారం. అయితే ఈ విషయమై వైఎస్ఆర్సీపీ తన అభిప్రాయాన్ని బీజేపీకి చెప్పాల్సి ఉంది.
లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలు కేటాయించడం ఆనవాయితీ. గత లోక్సభలో ఈ పదవిని అన్నాడిఎంకెకు కేటాయించారు. అన్నాడీఎంకెకు చెందిన తంబిదురై లోక్సభలో డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. ఏపీ రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాలను ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ దక్కించుకొంది. టీడీపీ కేవలం 3 స్థానాలకే పరిమితమైంది.
వైఎస్ఆర్సీపీకి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వాలనుకొంటున్నట్టుగా బీజేపీ నాయకత్వం వైఎస్ఆర్సీపీకి సమాచారం పంపింది. అయితే ఈ విషయమై వైఎస్ఆర్సీపీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టాలా... వద్దా అనే కోణంలో వైఎస్ఆర్సీపీ ఆలోచిస్తోంది. ఒకవేళ ఈ పదవిని తీసుకొంటే గిరిజనులకు ఈ పదవిని కట్టబెట్టాలని జగన్ ఆలోచిస్తున్నట్టుగా సమాచారం.